AP Cabinet Decisions: 80 వేల కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్.. లక్షకు పైగా ఉద్యోగాలు..!
- ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు..
- రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసే విధంగా కేబినెట్లో నిర్ణయం..
- సుమారు 80 వేల కోట్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం..
- లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్న పార్థసారథి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసే విధంగా ఇవాళ కేబినెట్లో నిర్ణయం జరిగిందన్నారు.. సుమారు 80 వేల కోట్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. దీని ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.. పారిశ్రామిక వేత్తలకు డెస్టినేషన్ ఏపీ అయ్యే విధంగా ఆమోదం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కంపోనెట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఇప్పటి వరకు అన్ని కంపోనెంట్లు పూర్తిగా మన దగ్గర తయారయ్యే పరిస్థితి లేదు.. ఎలక్ట్రానిక్ పాలసీ వల్ల ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది.. ఈ పాలసీ వల్ల తమిళనాడు, గుజరాత్ లో అభివృద్ధి జరిగిందని వెల్లడించారు..
Read Also: Peddapuram: పెద్దాపురంలో చీకటి బాగోతం.. మహిళ ఆవేదన వింటే చలించిపోతారంతే..!
Also Read
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
రాష్ట్రంలో సీఫీ.. గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు… డేటా సెంటర్ల వల్ల 16 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అన్నారు పార్థసారథి.. వైజాగ్ ను రాబోయే రోజుల్లో ఐటీ హబ్ గా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో అక్రమ లే ఔట్లు ఉన్నాయి.. అనేక లోపల వల్ల ఇళ్ల నిర్మాణం చేయలేకపోతున్నారు.. ఎల్ఆర్ఎస్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.. ఇక, ప్రపంచంలో పెద్ద సంస్థలు సింగపూర్ నుంచే పని చేస్తున్నాయి.. సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించాడానికి సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్తున్నారని వెల్లడించారు.. సీఎం సింగపూర్ ట్రిప్ విజయవంతం అవ్వాలని మేం కూడా కోరుకుంటున్నామన్నారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!