Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. జనసేన ఆవిర్భావ వేడుకలపై అధికారిక ప్రకటన..
- జనసేన ఆవిర్భావ వేడుకలపై పవన్ కీలక నిర్ణయం..
- మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు..
- పిఠాపురంలో ఆవిర్భావ వేడుకల నిర్వహణకు నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన ఆవిర్భావ వేడుకలపై అధికారికంగా ఓ ప్రకటన చేసింది జనసేన పార్టీ.. వచ్చే నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు.. ఈ సారి పిఠాపురంలో ఆవిర్భావ వేడుకల నిర్వహణకు జనసేనాని నిర్ణయం తీసుకుంది.. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాయి జనసేన శ్రేణులు.. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం అంటే.. 100 శాతం స్ట్రయిక్ రేట్తో జనసేన ఘన విజయం సాధించడమే కాకుండా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక, ఎన్నికల్లో అపూర్వ విజయం అనంతరం మొదట ఈ ఆవిర్భావ సభ జరగనుంది.. అదికూడా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం వేదికగా జరగనున్న నేపథ్యంలో.. జనసేన ఆవిర్భావ వేడులకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది..
Read Also: CM Revanth Reddy : సాగునీటిపై రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Also Read
అయితే, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో మూడు రోజులపాటు నిర్వహించాలని గతంలో ఆ పార్టీ నిర్ణయించింది. విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్వర్యంలో జరిగిన పీఏసీ సమావేశంలో.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదన మేరకు మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరించడంతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలని కమిటీ భావించింది. మార్చి 12 ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం అతిథులతో.. 14న బహిరంగ సభ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.. అయితే, తాజా ప్రకటనలో మాత్రం.. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు పిఠాపురంలో నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు పేర్కొన్నారు.. మరి ప్రతినిధుల సభపై తర్వాత క్లారిటీ ఇస్తారేమో చూడాలి..
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!