Home Minister Anitha: ప్రకాశం బ్యారేజీ కూల్చి వేతకు కుట్ర..! వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి..
- ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల ఘటనపై హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..
- ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర..!
- కుట్ర పన్నిన జగన్మోహన్రెడ్డి.. సహరించిన వాళ్లపై దేశ ద్రోహం కేసులు పెట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: కృష్ణానదిలో భారీ వరలు.. విజయవాడ అతలాకుతలం అవుతోన్న సమయంలో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం సంచలనంగా మారింది.. అయితే, దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ అధికార కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు హోం మంత్రి అనిత.. ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర పన్నిన జగన్మోహన్రెడ్డి, అందుకు సహరించిన వాళ్లపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు.. క్రిమినల్ రాజకీయ నాయకుడు అయితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో అర్థం అవుతుందన్న ఆమె.. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇసుక లూటీ కోసం ఉపయోగించిన బోట్లు ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయడానికి వాడారు… కౌంటర్ వెయిట్స్ కు కాకుండా పిల్లర్స్ కూలిపోయి వుంటే నష్టం మాటలకు అందేది కాదన్నారు.. బోట్లు పోయాయి అని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు.. ఉద్దడంద రాయుడు పాలెం దగ్గర వుండాల్సిన బోట్లు బ్యారేజ్ ఎగువకు ఎలా వచ్చాయి..? అని నిలదీశారు.
Read Also: Duleep Trophy 2024: సెకండ్ రౌండ్.. ఇండియా A కెప్టెన్గా మయాంక్ అగర్వాల్..
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఇక, ఈ ఘటన వెనుక బాధ్యులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు అనిత.. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఐదు బోట్లు వదిలితే రెండు మునిగిపోయి.. మరో మూడు కౌంటర్ వేయిట్స్ దెబ్బతీశాయి.. వైసీపీ రంగులు వేసి వున్న బోట్లు ఎవరివో తేల్చి బాధ్యులు అందరిపైనా చర్యలు తీసుకుంటాం అన్నారు.. మొరిగేవాళ్లను.. మేం పట్టించుకోం.. వైసీపీ నాయకులు హ్యుమానిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు నాయుడు పనితీరు, క్రైసిస్ మేనేజ్ మెంట్ ఎలా వుంటుందో ఆ పార్టీలో రాజకీయాలు ప్రారంభించిన మాజీ మంత్రి అమర్నాథ్ కు తెలియదా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురదజల్లెందుకు సోషల్ మీడియాలో వక్రీకరించి ప్రయత్నాలు చేస్తున్నారు.. వరదలకు సీఎం, హోంమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఇల్లా అనే తేడా వుండదు.. సిగ్గు లేకుండా… జరుగుతున్న సహాయ చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వరదల నష్టం అంచనాలు వేగవంతంగా జరుగుతున్నాయి .. వరదలు కారణంగా దెబ్బతిన్న వాహనాలు, ఇతర సామాగ్రి మరమ్మత్తుల కోసం అవసరం అయిన నష్ట పరిహారంపై వర్కవుట్ చేస్తున్నాం.. విజయవాడ వరదలను ఓ కేసు స్టడీగా తీసుకుని సహాయ చర్యలపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం.. నదులు, వాగులు పరీవాహక ప్రాంతాల్లో అక్రమాలపై విచారించి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఏలేరు వరదలలో సహాయ చర్యలు విస్తృతంగా జరుగుతున్నాయి.. విశాఖ నగరంలో కొండవాలు ప్రాంతాల పరిరక్షణ కోసం చర్యలు ప్రారంభించాం.. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటిగట్లు కోసం కేంద్రం సహకారం తీసుకుంటాం అన్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!