Home Minister Anitha: ప్రకాశం బ్యారేజీ కూల్చి వేతకు కుట్ర..! వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి..
- ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల ఘటనపై హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..
- ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర..!
- కుట్ర పన్నిన జగన్మోహన్రెడ్డి.. సహరించిన వాళ్లపై దేశ ద్రోహం కేసులు పెట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: కృష్ణానదిలో భారీ వరలు.. విజయవాడ అతలాకుతలం అవుతోన్న సమయంలో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం సంచలనంగా మారింది.. అయితే, దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ అధికార కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు హోం మంత్రి అనిత.. ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర పన్నిన జగన్మోహన్రెడ్డి, అందుకు సహరించిన వాళ్లపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు.. క్రిమినల్ రాజకీయ నాయకుడు అయితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో అర్థం అవుతుందన్న ఆమె.. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇసుక లూటీ కోసం ఉపయోగించిన బోట్లు ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయడానికి వాడారు… కౌంటర్ వెయిట్స్ కు కాకుండా పిల్లర్స్ కూలిపోయి వుంటే నష్టం మాటలకు అందేది కాదన్నారు.. బోట్లు పోయాయి అని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు.. ఉద్దడంద రాయుడు పాలెం దగ్గర వుండాల్సిన బోట్లు బ్యారేజ్ ఎగువకు ఎలా వచ్చాయి..? అని నిలదీశారు.
Read Also: Duleep Trophy 2024: సెకండ్ రౌండ్.. ఇండియా A కెప్టెన్గా మయాంక్ అగర్వాల్..
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
ఇక, ఈ ఘటన వెనుక బాధ్యులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు అనిత.. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఐదు బోట్లు వదిలితే రెండు మునిగిపోయి.. మరో మూడు కౌంటర్ వేయిట్స్ దెబ్బతీశాయి.. వైసీపీ రంగులు వేసి వున్న బోట్లు ఎవరివో తేల్చి బాధ్యులు అందరిపైనా చర్యలు తీసుకుంటాం అన్నారు.. మొరిగేవాళ్లను.. మేం పట్టించుకోం.. వైసీపీ నాయకులు హ్యుమానిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు నాయుడు పనితీరు, క్రైసిస్ మేనేజ్ మెంట్ ఎలా వుంటుందో ఆ పార్టీలో రాజకీయాలు ప్రారంభించిన మాజీ మంత్రి అమర్నాథ్ కు తెలియదా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురదజల్లెందుకు సోషల్ మీడియాలో వక్రీకరించి ప్రయత్నాలు చేస్తున్నారు.. వరదలకు సీఎం, హోంమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఇల్లా అనే తేడా వుండదు.. సిగ్గు లేకుండా… జరుగుతున్న సహాయ చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వరదల నష్టం అంచనాలు వేగవంతంగా జరుగుతున్నాయి .. వరదలు కారణంగా దెబ్బతిన్న వాహనాలు, ఇతర సామాగ్రి మరమ్మత్తుల కోసం అవసరం అయిన నష్ట పరిహారంపై వర్కవుట్ చేస్తున్నాం.. విజయవాడ వరదలను ఓ కేసు స్టడీగా తీసుకుని సహాయ చర్యలపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం.. నదులు, వాగులు పరీవాహక ప్రాంతాల్లో అక్రమాలపై విచారించి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఏలేరు వరదలలో సహాయ చర్యలు విస్తృతంగా జరుగుతున్నాయి.. విశాఖ నగరంలో కొండవాలు ప్రాంతాల పరిరక్షణ కోసం చర్యలు ప్రారంభించాం.. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటిగట్లు కోసం కేంద్రం సహకారం తీసుకుంటాం అన్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత.
తాజావార్తలు
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!