AP High Court: నేడు ఏపీ హైకోర్టులో కీలక కేసుల విచారణ..
- నేడు ఏపీ హైకోర్టులో కీలక కేసుల విచారణ..
- సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో తీర్పు ఇవ్వనున్న కోర్టు..
- పలు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు ఓ కీలక కేసులో తీర్పు వెలువరించడంతో పాటు.. పలు కీలక పిటిషన్లపై విచారణ చేపట్టనుంది.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు.. కాగా, సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు తేలిపోయింది. తన కేసు కొట్టి వేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు అయిన వరలక్ష్మి కూడా ఇంప్లీడ్ అయి తాము రాజీకీ వచ్చామని కేసు అవసరం లేదని చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. అయితే ఈ కేసులో ఈ రోజు తీర్పు ఇవ్వనుంది హైకోర్టు..
Read Also: Haryana Elections : నేడు హర్యానాలో ఎన్నికల పోరులోకి దిగనున్న మోదీ… గోహనాలో ర్యాలీ
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
మరోవైపు.. సంచలనం సృష్టించిన ముంబై సినీ నటి జిత్వానీ కేసులోనూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. హైకోర్టులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.. జిత్వానీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు గున్ని.. ఆ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది.. ఇక, ఏపీ హైకోర్టులో జోగి రమేష్ బాబాయ్ జోగి వేంకటేశ్వర రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏ1గా ఉన్న జోగి వేంకటేశ్వర రావు వేసిన పిటిషన్పై నేడు విచారణ చేయనుంది హైకోర్టు.. అయితే, జోగి రాజీవ్ ను అరెస్టు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్నారు జోగి వేంకటేశ్వర రావు.. మరోవైపు.. హైకోర్టులో సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ, సీఐడీ కేసుల్లో నిందితుడుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు.. ఆ పిటిషన్లపై కూడా నేడు విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు..
తాజావార్తలు
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?