Payyavula Keshav: ఏకంగా 13.4 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు.. వీళ్లని ఏమనాలి..?
- గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింది..
- అసెంబ్లీలో వైసీపీపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్..
- ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారు.. వీళ్లని ఏమనాలి..?
Payyavula Keshav: ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారు.. వీళ్లని ఏమనాలి..? అంటూ ఫైర్ అయ్యారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్పై రిప్లై ఇస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ వ్యాఖ్యానించారు.. సిగరెట్ పెట్టెల మీద స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చినట్లు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ పదే పదే చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.. ఇక, గత, ప్రభుత్వం చేసిన అప్పులపై స్పందిస్తూ.. 9 శాతానికి మించి ఉన్న అప్పులను గుర్తించాం.. దాదాపు 141 రుణాలు ఉన్నాయి. కొన్ని దాదాపు 13.4 శాతం వరకు వడ్డీకి తెచ్చారు. 9 శాతం.. 10 శాతం.. 11 శాతం.. 12 శాతం.. ఇలా పెంచుకుంటూ పోతూ ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారంటే.. వీళ్లనేమనాలి..? అని నిలదీశారు..
Read Also: SLBC Tragedy: టన్నెల్లో భయానకమైన పరిస్థితి నెలకొంది: డిజి నాగిరెడ్డి
Also Read
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా గత ప్రభుత్వం అప్పు తీసుకుంది. ఈ రోజుకు ఆ సంస్థకు 154 కోట్ల రూపాయల మేర అప్పు ఉంది.. ఈ అప్పును 13.4 శాతం మేర వడ్డీకి తెచ్చారని వివరించారు పయ్యావుల.. అంటే సంవత్సరానికి ఈ అప్పుపై వడ్డీనే 20.60 కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరపాల్సి వస్తుందన్నారు.. ఇప్పుడు మేం బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం.. బ్యాంకర్లు అంగీకరిస్తే.. ఆ వడ్డీ రేటు 9 శాతానికి తగ్గుతుంది. అప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ 13.83 కోట్లు రూపాయలుగా ఉంటుందన్నారు. అంటే ఈ ఒక్క రుణం మీదే 6.76 కోట్ల రూపాయల మేర భారం తగ్గుతుంది. ఇలా 1 లక్ష కోట్ల రూపాయల అప్పు మీద వడ్డీ రేట్లు తగ్గితే.. రాష్ట్ర ఖజానాపై భారం ఎంత వరకు తగ్గుతుందో ఆలోచించండి అని సూచించారు. బ్యాంకర్లతో నెగోషియేషన్స్ మొదలయ్యాయి… ఈ నెలాఖరుతో వడ్డీ రేట్లు తగ్గించగలమనే ఆశాభావంతో ఉన్నాం అన్నారు.
Read Also: Dragon : మా సినిమా చూడండి.. మహేష్ బాబుని రిక్వెస్ట్ చేసిన తమిళ దర్శకుడు
SASCI – ఈ స్కీం ద్వారా కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఒక వెసులుబాటు కల్పించింది … క్యాపిటల్ ఎక్స్ పెడించర్ మీద పెట్టే పెట్టుబడులకు దీర్ఘకాలానికి రుణాలు అందిస్తోంది.. FRBM లిమిట్లోకి రాదు.. వడ్డీ లేదని తెలిపారు పయ్యావుల కేశవ్.. 50 ఏళ్ల తర్వాత రీ-పేమెంట్ మొదలవుతుంది. గత ప్రభుత్వం 4079 కోట్లు ఉపయోగిస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే 7203 కోట్లను రుణంగా తీసుకున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ వళ్ల ఇదే ఉపయోగం.. గత ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి కేసుల గురించి లాబీయింగ్ చేసుకున్నారే తప్ప.. రాష్ట్రం గురించి ఆలోచన చేయలేదు. గత ప్రభుత్వం భవిష్యత్ మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేస్తే.. కూటమి ప్రభుత్వం మాత్రం భవిష్యత్తులో 50 ఏళ్ల వరకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేని విధంగా రుణాలను తీసుకొస్తోందని వెల్లడించారు.
తాజావార్తలు
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!