Payyavula Keshav: ఏకంగా 13.4 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు.. వీళ్లని ఏమనాలి..?
- గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింది..
- అసెంబ్లీలో వైసీపీపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్..
- ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారు.. వీళ్లని ఏమనాలి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payyavula Keshav: ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారు.. వీళ్లని ఏమనాలి..? అంటూ ఫైర్ అయ్యారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్పై రిప్లై ఇస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ వ్యాఖ్యానించారు.. సిగరెట్ పెట్టెల మీద స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చినట్లు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ పదే పదే చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.. ఇక, గత, ప్రభుత్వం చేసిన అప్పులపై స్పందిస్తూ.. 9 శాతానికి మించి ఉన్న అప్పులను గుర్తించాం.. దాదాపు 141 రుణాలు ఉన్నాయి. కొన్ని దాదాపు 13.4 శాతం వరకు వడ్డీకి తెచ్చారు. 9 శాతం.. 10 శాతం.. 11 శాతం.. 12 శాతం.. ఇలా పెంచుకుంటూ పోతూ ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారంటే.. వీళ్లనేమనాలి..? అని నిలదీశారు..
Read Also: SLBC Tragedy: టన్నెల్లో భయానకమైన పరిస్థితి నెలకొంది: డిజి నాగిరెడ్డి
Also Read
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా గత ప్రభుత్వం అప్పు తీసుకుంది. ఈ రోజుకు ఆ సంస్థకు 154 కోట్ల రూపాయల మేర అప్పు ఉంది.. ఈ అప్పును 13.4 శాతం మేర వడ్డీకి తెచ్చారని వివరించారు పయ్యావుల.. అంటే సంవత్సరానికి ఈ అప్పుపై వడ్డీనే 20.60 కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరపాల్సి వస్తుందన్నారు.. ఇప్పుడు మేం బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం.. బ్యాంకర్లు అంగీకరిస్తే.. ఆ వడ్డీ రేటు 9 శాతానికి తగ్గుతుంది. అప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ 13.83 కోట్లు రూపాయలుగా ఉంటుందన్నారు. అంటే ఈ ఒక్క రుణం మీదే 6.76 కోట్ల రూపాయల మేర భారం తగ్గుతుంది. ఇలా 1 లక్ష కోట్ల రూపాయల అప్పు మీద వడ్డీ రేట్లు తగ్గితే.. రాష్ట్ర ఖజానాపై భారం ఎంత వరకు తగ్గుతుందో ఆలోచించండి అని సూచించారు. బ్యాంకర్లతో నెగోషియేషన్స్ మొదలయ్యాయి… ఈ నెలాఖరుతో వడ్డీ రేట్లు తగ్గించగలమనే ఆశాభావంతో ఉన్నాం అన్నారు.
Read Also: Dragon : మా సినిమా చూడండి.. మహేష్ బాబుని రిక్వెస్ట్ చేసిన తమిళ దర్శకుడు
SASCI – ఈ స్కీం ద్వారా కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఒక వెసులుబాటు కల్పించింది … క్యాపిటల్ ఎక్స్ పెడించర్ మీద పెట్టే పెట్టుబడులకు దీర్ఘకాలానికి రుణాలు అందిస్తోంది.. FRBM లిమిట్లోకి రాదు.. వడ్డీ లేదని తెలిపారు పయ్యావుల కేశవ్.. 50 ఏళ్ల తర్వాత రీ-పేమెంట్ మొదలవుతుంది. గత ప్రభుత్వం 4079 కోట్లు ఉపయోగిస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే 7203 కోట్లను రుణంగా తీసుకున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ వళ్ల ఇదే ఉపయోగం.. గత ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి కేసుల గురించి లాబీయింగ్ చేసుకున్నారే తప్ప.. రాష్ట్రం గురించి ఆలోచన చేయలేదు. గత ప్రభుత్వం భవిష్యత్ మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేస్తే.. కూటమి ప్రభుత్వం మాత్రం భవిష్యత్తులో 50 ఏళ్ల వరకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేని విధంగా రుణాలను తీసుకొస్తోందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!