Dwaraka Tirumala Rao: పదవీ విరమణ ఫేర్వెల్ పరేడ్.. డీజీపీ భావోద్వేగం..
- మంగళగిరిలో డీజీపీ ద్వారకాతిరుమల రావు పదవీ విరమణ ఫేర్వెల్ పరేడ్..
- నా జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు..
- సర్వీసులో ఉన్నపుడు చేసిన పనులు నా జ్ఞాపకాలు..
- యూనిఫాం ఇకపై ఉండదు అనేది ఎమోషన్గా అనిపించింది..
Dwaraka Tirumala Rao: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తన పదవీ విరమణ ఫేర్వెల్ పరేడ్లో భావోద్వేగానికి గురయ్యారు.. యూనిఫామ్ ఇకపై ఉండదంటేనే భావోద్వేగంగా ఉందని పేర్కొన్నారు.. మంగళగిరి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డీజీపీ ద్వారకాతిరుమల రావు పదవీ విరమణ ఫేర్వెల్ పరేడ్ నిర్వహించారు.. ఏపీ నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ద్వారక తిరుమల రావు మాట్లాడుతూ.. నా జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు.. సర్వీసులో ఉన్నపుడు చేసిన పనులు నా జ్ఞాపకాలు.. దశాబ్దాలుగా నన్ను అంటిపెట్టుకుని ఉన్న యూనిఫాం ఇకపై ఉండదు అనేది ఎమోషన్గా అనిపించిందని పేర్కొన్నారు.. ఇన్నాళ్ల పాటు సర్వీసులో ఉన్న నాకు అనేక మంది సహకరించారు.. సర్వీసులో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సవాళ్లను చూశాను అన్నారు..
Read Also: Hyderabad: ఇన్స్టాలో పరిచయం.. పెళ్లి పేరుతో మోసం.. ట్విస్ట్ ఏంటంటే..?
Also Read
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
ఇక, సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని గుర్తుచేసుకున్నారు ద్వారకాతిరుమల రావు.. ప్రతి పోలీసులో ప్రొఫెషనలిజం తెస్తున్నాం.. సైబర్ క్రైమ్, గంజాయి, మహిళలు చిన్నారులపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాం అన్నారు. విపత్తుల సమయంలో ఏపీ పోలీసులు సాహసోపేతంగా పనిచేశారని ప్రశంసలు కురిపించారు.. యూనిఫాం ధరించిన వారి అందరికీ న్యాయం అందించాలి అని కోరుతున్నట్టు తెలిపారు.. క్రమశిక్షణ, నిజాయితీ, సంకల్పం కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి.. కేసుల విచారణలో కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇక, డీజీపీగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు ద్వారకా తిరుమల రావు.. బాధ్యతలు ఇవ్వటమే కాదు వాటి నిర్వహణకు గైడెన్స్ కూడా ఇచ్చారన్న ఆయన.. ప్రభుత్వ సహకారం వల్లే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశానని వెల్లడించారు.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు.. సర్వీసులో ఎన్నో జ్ఞాపకాలు, గుణపాఠాలు, పరిచయాలు, ఎమోషన్స్ తో కలిసి ఉన్నాయి.. విధి నిర్వహణలో లేనప్పటికీ నా మనసు పోలీసుల చుట్టూనే ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డీజీపీ ద్వారకాతిరుమల రావు.
తాజావార్తలు
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
-
PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
-
School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
-
Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!