CM Chandrababu: ముఖ్యమంత్రి దావోస్కు పయనం.. ఆల్ ది బెస్ట్ చెప్పిన అధికారులు
- సీఎం సర్.. ఆల్ ది బెస్ట్
- దావోస్ బయలుదేరిన సీఎం చంద్రబాబుకు విషెస్ చెప్పిన సీఎస్, అధికారులు
- గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం
- రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్కు ప్రయాణం
- రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం దావోస్ బయల్దేరారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి సీఎస్, అధికారులు విషెస్ చెప్పారు. ‘సీఎం సర్.. ఆల్ ది బెస్ట్’ అంటూ విష్ చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం.. రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్కు ప్రయాణం కానున్నారు. రేపు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు హాజరుకానున్నారు. పెట్టుబడులకు బ్రాండ్ ఏపీ లక్ష్యంగా.. ఏపీ సీఎం అండ్ టీం దావోస్ టూర్ జరగనుంది.
స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు రేపట్నుంచి ప్రారంభం కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు అండ్ టీం మూడు రోజుల పాటు ఈ సదస్సులో పాల్గొంటుంది. వివిధ దేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, ఏపీకి పెట్టుబడులు బ్రాండ్ ఏపీ లక్ష్యంగా ఈ టూర్ జరగనుంది. మొదటి రోజు సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్లో భారత రాయబారితో సమావేశం అవుతారు. తర్వాత పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరుగనుంది.
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
Read Also: Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..
రెండో రోజు దావోస్లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే గ్రీన్ హైడ్రోజన్కు సంబంధించిన చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత సోలార్ ఇంపల్స్, ఎల్ జి, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అవుతారు. యూఏఈ ఆర్ధిక మంత్రి అబ్దుల్లా బిన్తో చంద్రబాబు చర్చలు జరుపుతారు. ఆ తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించే ఎనర్జీ ట్రాన్స్ మిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే చర్చ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
మూడోరోజు కూడా పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు ఉంటాయి. ఏపీకి ఉన్న పెట్టుబడుల అవకాశాలు సీఎం అండ్ టీం వివరిస్తుంది. సీఎం చంద్రబాబుతో పాటు భారీ పరిశ్రమల శాఖా మంత్రి టిజి భరత్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఈడీబీ అధికారులు బృందం ఉంటుంది. ఏపీకి ఉన్న తీరరేఖ మౌలిక సదుపాయాలు, నదులు, మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా వివరించి బాబు అండ్ టీం దావోస్ పర్యటనలో పెట్టుబడులపై దృష్టి పెట్టనుంది.
Read Also: Top Headlines @9PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!