CM Chandrababu: ముఖ్యమంత్రి దావోస్కు పయనం.. ఆల్ ది బెస్ట్ చెప్పిన అధికారులు
- సీఎం సర్.. ఆల్ ది బెస్ట్
- దావోస్ బయలుదేరిన సీఎం చంద్రబాబుకు విషెస్ చెప్పిన సీఎస్, అధికారులు
- గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం
- రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్కు ప్రయాణం
- రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం దావోస్ బయల్దేరారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి సీఎస్, అధికారులు విషెస్ చెప్పారు. ‘సీఎం సర్.. ఆల్ ది బెస్ట్’ అంటూ విష్ చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం.. రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్కు ప్రయాణం కానున్నారు. రేపు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు హాజరుకానున్నారు. పెట్టుబడులకు బ్రాండ్ ఏపీ లక్ష్యంగా.. ఏపీ సీఎం అండ్ టీం దావోస్ టూర్ జరగనుంది.
స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు రేపట్నుంచి ప్రారంభం కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు అండ్ టీం మూడు రోజుల పాటు ఈ సదస్సులో పాల్గొంటుంది. వివిధ దేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, ఏపీకి పెట్టుబడులు బ్రాండ్ ఏపీ లక్ష్యంగా ఈ టూర్ జరగనుంది. మొదటి రోజు సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్లో భారత రాయబారితో సమావేశం అవుతారు. తర్వాత పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరుగనుంది.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
Read Also: Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..
రెండో రోజు దావోస్లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే గ్రీన్ హైడ్రోజన్కు సంబంధించిన చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత సోలార్ ఇంపల్స్, ఎల్ జి, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అవుతారు. యూఏఈ ఆర్ధిక మంత్రి అబ్దుల్లా బిన్తో చంద్రబాబు చర్చలు జరుపుతారు. ఆ తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించే ఎనర్జీ ట్రాన్స్ మిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే చర్చ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
మూడోరోజు కూడా పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు ఉంటాయి. ఏపీకి ఉన్న పెట్టుబడుల అవకాశాలు సీఎం అండ్ టీం వివరిస్తుంది. సీఎం చంద్రబాబుతో పాటు భారీ పరిశ్రమల శాఖా మంత్రి టిజి భరత్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఈడీబీ అధికారులు బృందం ఉంటుంది. ఏపీకి ఉన్న తీరరేఖ మౌలిక సదుపాయాలు, నదులు, మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా వివరించి బాబు అండ్ టీం దావోస్ పర్యటనలో పెట్టుబడులపై దృష్టి పెట్టనుంది.
Read Also: Top Headlines @9PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!