CM Chandrababu: ముఖ్యమంత్రి దావోస్కు పయనం.. ఆల్ ది బెస్ట్ చెప్పిన అధికారులు
- సీఎం సర్.. ఆల్ ది బెస్ట్
- దావోస్ బయలుదేరిన సీఎం చంద్రబాబుకు విషెస్ చెప్పిన సీఎస్, అధికారులు
- గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం
- రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్కు ప్రయాణం
- రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం దావోస్ బయల్దేరారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి సీఎస్, అధికారులు విషెస్ చెప్పారు. ‘సీఎం సర్.. ఆల్ ది బెస్ట్’ అంటూ విష్ చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం.. రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్కు ప్రయాణం కానున్నారు. రేపు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు హాజరుకానున్నారు. పెట్టుబడులకు బ్రాండ్ ఏపీ లక్ష్యంగా.. ఏపీ సీఎం అండ్ టీం దావోస్ టూర్ జరగనుంది.
స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు రేపట్నుంచి ప్రారంభం కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు అండ్ టీం మూడు రోజుల పాటు ఈ సదస్సులో పాల్గొంటుంది. వివిధ దేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, ఏపీకి పెట్టుబడులు బ్రాండ్ ఏపీ లక్ష్యంగా ఈ టూర్ జరగనుంది. మొదటి రోజు సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్లో భారత రాయబారితో సమావేశం అవుతారు. తర్వాత పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరుగనుంది.
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
Read Also: Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..
రెండో రోజు దావోస్లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే గ్రీన్ హైడ్రోజన్కు సంబంధించిన చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత సోలార్ ఇంపల్స్, ఎల్ జి, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అవుతారు. యూఏఈ ఆర్ధిక మంత్రి అబ్దుల్లా బిన్తో చంద్రబాబు చర్చలు జరుపుతారు. ఆ తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించే ఎనర్జీ ట్రాన్స్ మిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే చర్చ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
మూడోరోజు కూడా పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు ఉంటాయి. ఏపీకి ఉన్న పెట్టుబడుల అవకాశాలు సీఎం అండ్ టీం వివరిస్తుంది. సీఎం చంద్రబాబుతో పాటు భారీ పరిశ్రమల శాఖా మంత్రి టిజి భరత్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఈడీబీ అధికారులు బృందం ఉంటుంది. ఏపీకి ఉన్న తీరరేఖ మౌలిక సదుపాయాలు, నదులు, మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా వివరించి బాబు అండ్ టీం దావోస్ పర్యటనలో పెట్టుబడులపై దృష్టి పెట్టనుంది.
Read Also: Top Headlines @9PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
SSC GD 2026: అభ్యర్థులకు అలర్ట్.. SSC GD కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు.. కొత్త ఎగ్జామ్ డేట్ ఇదే
-
Yamaha Ethanol Bike: ఇథనాల్తో నడిచే యమహా బైక్ భారత్లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?