Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..
- సంభాల్ హింస కేసులో మరో 10 మంది అరెస్ట్..
- ఒకరికి పాక్ ఐఎస్ఐ, దావూద్ ముఠాతో సంబంధం..
- హింస సమయంలో కాల్పులు జరిపిన అఫ్రోజ్..
- కాల్పుల్లో మరణించిన ఇద్దరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal violence: గతేడాది నవంబర్ 24న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్లో జరిగిన హింసత యావత్ దేశంలో సంచలనంగా మారింది. షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన బృందంపై అల్లరి మూకలు దాడి చేశాయి. మసీదు సర్వేకి అంతరాయం కలిగించేందుకు ఓ వర్గం రాళ్లదాడికి పాల్పడింది. ఈ ఘటనలో పలువురు అధికారులు గాయపడ్డారు. నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ కేసులుని యోగి సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఈ అల్లర్లో పాల్గొన్న మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంభాల్లోని షాహీ జామా మసీదు, ఒకప్పటి హరిహర్ మందిరమని హిందూ పక్షం కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై కోర్టు మసీదు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 24, 2024లో సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడి జరిగింది.
Read Also: Hair care: ఈ మూడు రకాల నూనెలు జుట్టుకు పట్టిస్తే.. దృఢంగా మారడం ఖాయం?
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
వీరిలో ముల్లా అఫ్రోజ్ అనే వ్యక్తికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు ఏఎస్పీ శ్రీ చంద్ర ఆదివారం తెలిపారు. అరెస్టు చేయబడిన వారిలో తొమ్మిది మంది అల్లర్ల సమయంలో పోలీసులపై రాళ్లు విసిరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, మరొకరు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ హింసాకాండలో అఫ్రోజ్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిలాల్ అన్సారీ, అయాన్ అనే ఇద్దరు యువకులు అఫ్రోజ్ జరిపిన కాల్పుల్లో మరణించారని, గందరగోళ సమయంలో మరణించిన నలుగురిలో వీరు కూడా ఉన్నారని వెల్లడించారు.
ముల్లా అఫ్రోజ్ ఉత్తరప్రదేశ్లోని మోస్ట్ వాంటెడ్ నేరస్థులలో ఒకరైన గ్యాంగ్స్టర్ షరీక్ సాతాతో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. దుబాయ్ నుండి భారతదేశంలో తన ముఠా నెట్వర్క్ను నడుపుతున్న సాతాతో ఆఫ్రోజ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాడని పోలీసులు తెలిపారు. షరీక్ సాతా పారిపోయిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధం కలిగి ఉన్నాడని, ISI తో సంబంధాలు కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. సంభాల్కి చెందిన సతాపై యూపీ, ఢిల్లీలో 50కి పైగా కేసులు ఉన్నాయి. నకిలీ పాస్పోర్ట్ ఉపయోగించి కొన్నేళ్ల క్రితం దుబాయ్ పారిపోయాడు. అప్పటి నుంచి భారత నిఘా సంస్థలు ఇతడి కోసం వెతుకుతున్నాయి.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!