TDLP Meeting: నేడు టీడీఎల్పీ సమావేశం.. కీలక సూచనలు చేయనున్న సీఎం చంద్రబాబు
- నేడు టీడీఎల్పీ సమావేశం..
- హాజరుకానున్న ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు..
- ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు చేయనున్నసీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDLP Meeting: నిత్యం ఏదోఒక కార్యక్రమాలు.. సమావేశాలు.. రివ్యూలతో బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుదిరినప్పుడల్లా పార్టీ కార్యక్రమాలకు కూడా సమయం కేటాయిస్తున్న విషయం విదితమే.. ఇక, ఈ రోజు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోన్న ఆయన.. సాయంత్రం 5 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే గడపనున్నారు.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎంపీలు కూడా పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చలు జరగనున్నట్టుగా తెలుస్తోంది..
Read Also: Railway Ticket Booking: ఇకపై 60 రోజుల ముందే రైలు బుకింగ్ల ముందస్తు రిజర్వేషన్
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
అయితే, మద్యం షాపులు, ఇసుక సహా ఇతర కీలక అంశాలపై ఎమ్మెల్యేలు ఇష్టానుసారం ప్రవర్తిస్తే చర్యలు తప్పవని ఇప్పటికే స్పష్టం చేసిన చంద్రబాబు.. దానిపై మరింత అవగాహన కల్పించనున్నారా? అనే చర్చ సాగుతోంది.. మొత్తంగా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.. ఏపీలో మద్యం టెండర్లు, ఇసుక పాలసీలో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కొందరి ఎమ్మెల్యేల ప్రవర్తన ఉందంటూ సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇసుక, మద్యం విషయాల్లో పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా కొందరు వ్యవహరిస్తున్నారని పార్టీ అంతర్గతంగా కొంత చర్చ జరుగుతోందట.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తు్న్నారని చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నట్టు పార్టీలో చర్చ సారుగుతోంది.. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఇదే విషయంపై చంద్రబాబు సీరియస్ అయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు.. ముఖ్యంగా రాయలసీమలోని కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల వ్యవహారంపై సీఎం గుర్రుగా ఉన్నారనే చర్చసాగుతోంది.. మొత్తంగా ఇవాళ్టి సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి.. ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!