Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Reviews Law Order Focus On Cyber Crime And Road Safety

CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

Published Date :May 8, 2026 , 9:51 pm
By Sudhakar Ravula
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

CM Chandrababu: అమరావతిలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల నివారణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అయితే, ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల శాతం తగ్గినట్లు వివరించారు.

డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం:
* మహిళలపై నేరాలు 7 శాతం తగ్గాయి
* చోరీలు 8 శాతం తగ్గాయి
* ఆర్థిక నేరాలు 0.3 శాతం తగ్గాయి
* ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 30 శాతం తగ్గాయి
* సైబర్ నేరాల్లో బాధితులు మొత్తం రూ.652 కోట్లు కోల్పోయారని, అందులో రూ.116 కోట్లు ఫ్రీజ్ చేయగలిగామని డీజీపీ వెల్లడించారు.

Also Read

  • AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
  • Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
Add as a preferred
source on google

సైబర్ నేరాలపై మరింత అప్రమత్తత అవసరం
సైబర్, ఆర్థిక నేరాలను అరికట్టడంలో మరింత చురుకుగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని సూచించారు. సైబర్ నేరాలను సమర్థంగా నియంత్రించేందుకు ప్రత్యేక సైబర్ ఫోర్స్‌తో “సైబర్ వార్ రూమ్” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ఫలితాలు చూపించాలని అధికారులకు చెప్పారు.

కన్విక్షన్ రేటు పెంపుపై దృష్టి
2025లో రాష్ట్రంలో కన్విక్షన్ రేటు 44 శాతంగా ఉండగా, 2026లో అది 49.8 శాతానికి పెరిగినట్లు డీజీపీ వివరించారు. అయితే దీన్ని 70 శాతానికి తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని సీఎం నిర్దేశించారు. టెక్నాలజీని వినియోగించి ఆధారాలు సేకరించడం, వేగవంతమైన దర్యాప్తు ద్వారా నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని సూచించారు. ఇక “ఇన్ విజిబుల్ పోలీస్ కాదు.. విజిబుల్ పోలీసింగ్ చేసి చూపించాలి” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీసుల చర్యలు చూసి నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి రావాలని అన్నారు. చోరీ కేసుల్లో ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకునేలా చర్యలు ఉండాలని సూచించారు.

ఎర్రచందనం అక్రమ రవాణాపై డీజీపీ వివరాలు
గత ఏడాదిలో 50 వేల కిలోల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. ఈ కేసుల్లో 302 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో 91 శాతం కన్విక్షన్ రేటు నమోదైందని చెప్పారు. పోలీసింగ్‌లో సాంకేతికత వినియోగాన్ని పెంచుతున్నామని డీజీపీ తెలిపారు. గత ఏడాదిలో డ్రోన్ల ద్వారా లక్ష గంటలపాటు సర్విలెన్స్ నిర్వహించామని చెప్పారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో కూడా డ్రోన్ల వినియోగాన్ని పెంచినట్లు వెల్లడించారు.

జిల్లా ఎస్పీల ప్రజెంటేషన్లు
సమావేశంలో పలువురు జిల్లా ఎస్పీలు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న విధానాలను వివరించారు. ముఖ్యంగా కుల వివాదాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజా భద్రత అంశాల్లో చేపట్టిన చర్యలను వివరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Law and Order
  • Andhra Pradesh News
  • AP Collectors Conference
  • AP Crime Rate
  • AP Cyber Crime

తాజావార్తలు

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

  • Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్

  • China-Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చైనా ప్రత్యక్ష సహాయం..!

  • Peddi: ‘పెద్ది’ రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions