Kadapa's Gandikota Minor Girl Murder: కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి పది రోజులు కావస్తున్నా..ఈ కేసు ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. మైనర్ బాలికను ఆమె ప్రియుడు గండికోట ముఖద్వారం వద్ద వదిలి వెళ్ళిన తరువాత గండికోటలోని మాధవరాయ స్వామి గుడికి వెళుతున్న ఫోటోలు ఇప్పుడు ఎన్టీవీ చేతికి చిక్కాయి..
కడప జిల్లా గండికోటలో యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ఇప్పటికీ గండికోట రహస్యంగానే ఉంది. ఆమెను ఎవరు హత్య చేశారో ఇప్పటి వరకు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు పోలీసులు. ప్రియుడే హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రియుడి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. ఇంతకీ పలు మలుపులు తిరుగుతున్న వైష్ణవి హత్య కేసులో ప్రధాన పాత్రధారులెవరు? హత్యా, పరువు హత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కడప జిల్లా గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి…