CM Chandrababu: ఇసుకపై సీఎం సమీక్ష.. ఫిర్యాదుల నేపథ్యంలో కీలక ఆదేశాలు.. రేపటి నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్
- ఇసుక సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇబ్బందుల నేపథ్యంలో కీలక ఆదేశాలు..
- రేపటి నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్..
- ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇబ్బందుల నేపథ్యంలో కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక లభ్యత, పారదర్శకంగా సరఫరా, అక్రమాల నియంత్రణ వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో లభ్యత పెంచాల్సిందిగా స్పష్టం చేశారు.. జిల్లాల్లో ఇసుక రీచ్ లలో పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లాస్థాయి శాండ్ కమిటీలు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని మరోమారు అధికారులకు సూచనలు చేశారు.. రీచ్ లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతించాలని పేర్కొన్నారు సీఎం..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
ఇక, ఇసుక ధరల్ని కట్టడి చేసేందుకు జిల్లా స్థాయిలో ధరలను మరల సమీక్షించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. స్థానిక ఇసుక రీచ్ ల వద్ద తవ్వకం కోసం నిర్దేశించిన రుసుము మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిందిగా మరోమారు స్పష్టం చేసిన ఆయన.. ఈ అంశంలో ఏమైనా ఫిర్యాదులు వస్తే సహించబోమని తేల్చి చెప్పారు.. ఇసుక పై ఖర్చు తగ్గేలా రవాణా, తవ్వకం వ్యయం అతి తక్కువగా ఉండేలా చూడాల్సిందిగా సూచించిన ఆయన.. ఇసుక సరఫరాపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయాల్సిందిగా ఆదేశించారు.. రేపటి నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు సేకరించాల్సిందిగా సీఎం ఆదేశాలు ఇచ్చారు.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించిన సీఎం.. నిరంతరం సర్వియలెన్స్ కెమెరాలతో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు నడపాలని సూచించారు.. పోలీసులు జిల్లాల్లో జరిగే అక్రమ రవాణాపై నిరంతరం దృష్టి పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అందే ఫీడ్ బ్యాక్ తో పాటు ఫిర్యాదులపై తదుపరి సమావేశంలో సమీక్షిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!