CM Chandrababu: దేశానికి సుపరిపాలనను పరిచయం చేసిన నేత అటల్ జీ..
- వాజ్పేయి చేసిన సేవలు శాశ్వతంగా గుర్తుండేలా స్మృతివనం ఏర్పాటు చేస్తాం..
- ఎన్టీఆర్, వాజ్పేయి చాలా చనువుగా ఉండేవారు..
- కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దేశంలో ఫ్రంట్ ఏర్పాటు చేసిన మొదటి నాయకుడు ఎన్టీఆర్..
- వాజ్పేయి టెలికాం సెక్టార్ ను తీసుకొచ్చారు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అమరావతిలో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఒక చరిత్ర, ఒక యుగపురుషుడు జన్మించిన రోజు.. ప్రజా రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.. శత జయంతి ఉత్సవాలను ఈ ప్రాంతంలో ఇంత ఘనంగా జరుపుకున్నాం అంటే అది రూపాయి కూడా తీసుకోకుండా భూములు ఇచ్చిన అన్నదాతల చొరవే.. శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కూటమి నేతల సహకారం మర్చిపోలేనిది.. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నేత అటల్ జీ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Shivraj Singh chouhan: ఒకప్పటి IT మ్యాన్ నేటి AI మ్యాన్ చంద్రబాబు
Also Read
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
అయితే, యాంటీ కాంగ్రెస్ కు బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు.. రామారావుకి వాజ్ పేయికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలో మొదటిసారిగా ఆర్టికల్ సవరణ ప్రారంభించిన వ్యక్తి పీవీ నరసింహా రావు ఆయన ఓ తెలుగు వ్యక్తి.. వాజ్ పేయితో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తులలో నేను ముఖ్యమైన వాడిని.. మలేషియా దేశాన్ని చూసి అటల్ జీకి చెప్పిన వెంటనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో చెన్నై తడ హైవేను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.. అనేక సంస్కరణలు తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత అటల్ జీకి మాత్రమే దక్కుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇక, హైదరాబాద్ లో ఓపెన్ స్కై పాలసీ ద్వారా ఫ్లైట్ లు మంజూరు చేసిన ఘనత అటల్ జీ ది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 1 లక్ష 46 వేల కిలో మీటర్ల హైవేలను భారత్ దేశంలో నిర్మించింది వాజ్ పేయి హయంలోనే అని గుర్తు చేశారు. అప్పటి కార్గిల్, నేటి సింధూర్ లలో ప్రత్యర్థి దేశానికి చెమటలు పట్టించిన ఘనత అప్పుడు అటల్ జీ ది, నేడు నరేంద్ర మోడీ ది అని ప్రశంసించారు. రాష్ట్రంలో- దేశంలో ఉన్న ప్రజలకు ఒకటే విజ్ఞప్తి.. భారత దేశం ఉన్నంత వరకు దేశ ప్రజల గుండెల్లో ఉండబోయే వ్యక్తి, ఉన్న వ్యక్తి కచ్చితంగా అటల్ జీ మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!