Shivraj Singh chouhan: ఒకప్పటి IT మ్యాన్ నేటి AI మ్యాన్ చంద్రబాబు
- ఒకప్పటి IT మ్యాన్ నేటి AI మ్యాన్ చంద్రబాబు..
- అటల్ జీ చంద్రబాబుతో ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నాడు..
- మోడీ- చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంది: శివరాజ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivraj Singh chouhan: భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఏపీలో ఘనంగా కొనసాగుతున్నాయి. రాజధాని అమరావతిలో 14 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఒకప్పటి IT మ్యాన్ నేటి AI మ్యాన్ చంద్రబాబు నాయుడు తో పాటు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మనందరీ ముఖ్య నేత అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహం ఆవిష్కరణకు సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొనటం ఆనందంగా ఉంది.. హిందీలో అమ్మనీ మా అంటారు కానీ మధ్యప్రదేశ్ లో మాత్రం మామా అంటూ రెండు సార్లు స్మరించుకుంటారని శివరాజ్ సింగ్ అన్నారు.
Read Also: DK Shivakumar: డీకే.శివకుమార్లో నైరాశ్యం.. కార్యకర్తగా ఉంటే బెటర్ అంటూ కామెంట్
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ఇక, అటల్ బిహారీ వాజ్ పేయి గురించి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆయన ప్రసంగాలు విని ఎప్పటికైనా ఈ నవ యువకుడు దేశ ప్రధాని అవుతాడని జోస్యం చెప్పారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ తెలిపారు. పార్టీలు వస్తాయి పోతాయి కానీ దేశం ముఖ్యం, దేశ భక్తి ముఖ్యం అన్న నినాదం అటల్ జీ ది.. దేశ భద్రత విషయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీకి పూర్తి సహకారం వాజ్ పేయి అందించారు.. కానీ, నేను ఇందిరా మనవడు రాహుల్ గాంధీ మాత్రం భద్రత విషయంలో మోడీనీ ప్రశ్నిస్తూ ప్రత్యర్థి దేశాలకు మద్దతు ఇస్తున్నట్లుగా ఉంది.. మొదటిసారి ప్రధానిగా అవకాశం దక్కించుకున్న అటల్ జీ తన పదవినీ కాపాడుకునేందుకు రాజకీయ విలువల్ని వదలలేదని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
Read Also: Eesha Movie Review: ‘ఈషా’ మూవీ రివ్యూ!
అయితే, రెండవ సారి ప్రధానిగా అటల్ జీ అవకాశం దక్కించుకున్న తర్వాత ఆయన చంద్రబాబుతో రాజకీయ సంబంధాలే కాకుండా ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నాడని శివరాజ్ సింగ్ అన్నారు. అటల్ జీ- చంద్రబాబు భాగస్వామ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెట్టింది.. నేడు మోడీ- చంద్రబాబు నాయకత్వంలో విభజన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది అన్నారు. చంద్రబాబు NDA కన్వీనర్ కాదు విజయవంతంగా కూటమినీ నడిపిన రథ సారథి అన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?