Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
- కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి..
- వారంపాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు ప్లాన్..
- ఇన్నాళ్ళు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మమ అన్నట్టు కార్యక్రమాలు..
- సమరభేరి ఆషామాషీ నిర్ణయం కాదంటూ నేతలకు కేటీఆర్ క్లారిటీ..
- మీరు లైట్ తీసుకుంటే పార్టీ మిమ్మల్ని లైట్ తీసుకుంటుందని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అవుతోంది. దీంతో… ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం పేరిట సమరభేరి మోగించబోతోంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ పోరు బాట పట్టబోతోంది. అయితే… ఏదో, తూతూ మంత్రంగా ఒకరోజు నిరసన కార్యక్రమం నిర్వహించి వదిలేయకుండా… వారం రోజులపాటు నిరసన ప్రర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది గులాబీ అధిష్టానం. సమరభేరి పేరిట పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, వారంపాటు షెడ్యూల్ వేయడం వెనక గట్టి కారణమే ఉండవచ్చని అంటున్నాయి రాజకీయవర్గాలు. ఇప్పటి వరకు పార్టీ తీసుకున్న కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ… జిల్లా, నియోజకవర్గాల లెవల్లో మాత్రం మమ అనిపిస్తున్నట్టు అధిష్టానం దగ్గర ఫీడ్బ్యాడ్ ఉందట. అందుకే…ఈసారి వారంపాటు చేయబోయే సమరభేరిని చేశామంటే చేశాం అన్నట్టు కాకుండా…సీరియస్గా జరపాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. దీంతో… కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం కావాలంటే… దాంట్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కచ్చితంగా పాల్గొనాలని కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్లో ఆదేశించారట.
అదే సమయంలో పార్టీ నేతలకు ఆయన సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లకపోయినా పెద్దగా పట్టించుకోలేదని, ఇక మీదట అలా ఉండబోదని కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై వారం రోజులపాటు సమరభేరి చేయాలని ఆషామాషీగా నిర్ణయం తీసుకోలేదని, ఇది భవిష్యత్ సంకేతమని అన్నట్టు చెప్పుకుంటున్నారు. వారం రోజుల కార్యక్రమాన్ని జిల్లా, మండల, గ్రామస్థాయిలో కూడా సక్సెస్ చేయాలని కేటీఆర్ గట్టిగా అన్నట్టు తెలిసింది. గతంలోని కార్యక్రమాల మాదిరిగానే దీన్ని కూడా లైట్ తీసుకుంటే వాళ్లను పార్టీ కూడా లైట్ తీసుకుంటుందని స్ట్రాంగ్గా హెచ్చరించినట్టు సమాచారం. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు పార్టీ కార్యక్రమాలను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారని, ఆ వైఖరి పార్టీకి నష్టం చేస్తోందని అన్నారట కేటీఆర్. ఎన్నికలకు మరో రెండేళ్ళ సమయం ఉండటంతో.. ఇప్పట్నుంచే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని ముఖ్య నేతలకు చెప్పారట కేటీఆర్. సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయకుంటే అలాంటి వాళ్ళ విషయంలో కఠినమైన నిర్ణయాలు ఉంటాయని కూడా కేటీఆర్ కుండబద్దలు కొట్టారని చెబుతున్నారు.
Also Read
సమరభేరి కార్యక్రమం విజయవంతంకాని నియోజకవర్గాలను గుర్తించి… అక్కడి ఇన్చార్జ్లను మార్చే ప్రతిపాదన కూడా ఉందట.ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందేమోనని, ఏ నియోజకవర్గం ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పట్నుంచే ఖర్చు చేయడం ఎందుకని కొందరు దూరంగా ఉంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారట కేటీఆర్. ఏ కార్యక్రమమైనా రాష్ట్ర పార్టీ నుంచి ఖర్చు చేయాలంటే కష్టమని, లోకల్ గా ఉన్నవాళ్లు, గతంలో పదవులు అనుభవించిన వాళ్ళే అన్నీ చూసుకోవాలని పరోక్షంగా చెప్పినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎలా ఉన్నా… ఇక ఎన్నికల టైం సమీపించేకొద్దీ వత్తిడి పెరుగుతుంది కాబట్టి… ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోకూడదని గులాబీ అధిష్టానం భావిస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!