CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలు.. మంత్రులకు టార్గెట్ పెట్టిన సీఎం..
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..
- మంత్రులకు టార్గెట్ పెట్టిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ మంత్రులకు టార్గెట్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 27న ఏపీలో రెండు గ్రెడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.. ఇంఛార్జ్ మంత్రులు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి. దీంతో జిల్లా ఇంఛార్జ్ మంత్రులు పర్యటనలో ఉన్నారు.. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు గ్రేడ్యుయేట్ స్థానాలకు.. విశాఖ -విజయనగరం – శ్రీకాకుళం ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయ్యింది.. దీంతో, కూటమి నేతలు, మంత్రులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు..
Read Also: AP Cabinet Meeting: రేపే ఏపీ కేబినెట్ భేటీ.. ఎజెండాలో కీలక అంశాలు..!
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు ఏపీ.. సింగపూర్లో చంద్రబాబు కీలక ప్రసంగం
తూర్పుగోదావరి – పశ్చిమగోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు.. ప్రధానంగా చదువుకున్న వారికి ఈ ప్రభుత్వం ఏ రకంగా మేలు చేస్తున్నది అనేది నేతలు ప్రచారంలో వివరిస్తున్నారు.. సీఎం చంద్రబాబు కూడా గ్రేడ్యుయేట్లను ఆకర్షించే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.. ఉభయగోదావరిలో సీపీఎం పోటీలో ఉంది. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది.. ఇక, కృష్ణ – గుంటూరు గ్రేడ్యూయెట్ లకు సంబంధించి ఆలపాటి రాజా పోటీలో ఉన్నారు.. ఇక్కడ కూడా కృష్ణ – గుంటూరు మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ, పీడీఎఫ్ నుంచి పోటీ ఉంది.. దీంతో, మంత్రులు ప్రచారం ముమ్మరం చేశారు. సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసినట్టుగానే మంత్రులు, నేతలు.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.. విశాఖ – విజయనగరం – శ్రీకాకుళం టీచర్ ఎమ్మెల్సీ గా రఘువర్మ పోటీ చేస్తున్నారు. టీచర్ ఫెడరేషన్ నుంచి గాదె శ్రీనివాసులు పోటీలో ఉన్నారు.. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో విజయం సాధించాలని టీడీపీ దృష్టి పెట్టింది.. మంత్రులు కూడా ఈ మూడు వారాలు సీరియస్గా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని.. విజయం సాధించాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్స్టా స్టోరీ!
-
RBI New Rules: ఇక బ్యాంకుల దౌర్జన్యానికి చెక్.. ఆర్బీఐ న్యూ రూల్స్.. బ్యాంకు కస్టమర్లకు భారీ ఊరట
-
Prabhas Spirit : స్పిరిట్ క్రేజ్.. వారణాసి, డ్రాగన్, రాకాని క్రాస్ చేసిన రెబల్ స్టార్
-
FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
-
Prabhas : రెబల్ ఫ్యాన్స్ యుద్ధానికి సిద్ధమవండి!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!