CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కీలక అంశాలపై చర్చించారు.. నెలలో నాలుగు రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమం ద్వారా విధిగా గ్రామాల్లో ఉండి సమస్యలు తెలుసు కోవాలని సూచించారు.. ఇక, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాం అని మంత్రులకు చెప్పారు సీఎం చంద్రబాబు.. మన రాష్ట్రంలో లబ్ధిదారుల కన్నా ఇతర రాష్ట్రాల్లో లబ్ధిదారులు చాలా తక్కువ.. అయినా కూడా పథకాలకు సంబంధించి సరిగ్గా చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు.. మంత్రులు పల్లెల్లో బస చేసే కార్యక్రమానికి పల్లె వెలుగు.. స్వర్ణ గ్రామం అని పేరు పెట్టాలని కేబినెట్లో చర్చించారు.. ఈ పేరుతో పాటు మరికొన్ని పేర్లు పరిశీలించాలని సూచించారు.. ఇక, ఈ కార్యక్రమానికి త్వరలో విధి విధానాలు ఖరారు చేయనున్నట్టు మంత్రులకు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Viral Video: అర్ధరాత్రి వంటింటి గోడపై ప్రత్యక్షమైన మృగరాజు!
ఇక, విశాఖ ఋషికొండపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు.. ఋషి కొండ భవనాలను ఏం చేయాలనే అంశంపై చర్చించారు.. మొదట మంత్రులంతా ఋషికొండను సందర్శించాలని సీఎం సూచించారు.. ఆ తర్వాత ఏం చేద్దాం అనే దానిపై మంత్రులు అభిప్రాయాలు చెప్పాలన్నారు.. మరోవైపు.. పాస్టార్ ప్రవీణ్ మృతిపై మంత్రులతో చర్చించారు సీఎం.. సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తగా స్పందన ఉండాలని ఆదేశాలు జారీ చేశారు..