CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో నిర్వహించిన “పేదల సేవలో” కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణంలో కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వివిధ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలపై అధికారులు సీఎంకు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెప్మా, హెల్త్, సివిల్ సప్లై శాఖలను నైపుణ్య పోర్టల్తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 35 మంది భవన నిర్మాణ కార్మికులకు పీ4 పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయ చెక్కులను సీఎం చంద్రబాబు అందజేశారు. అలాగే మేడే పురస్కారాలను కూడా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “ఏపీలో ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం వచ్చింది” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం గత 22 నెలలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. మేడే అనేది శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే రోజని, కార్మికుల హక్కులను గుర్తుచేసే సందర్భమని పేర్కొన్నారు. పామర్రు అనేది మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జన్మస్థలం అని, ఆయన దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు. ప్రస్తుతం శారీరక కష్టం కంటే నైపుణ్యంతో పని చేసే రోజులు వచ్చాయని, అందుకే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. రాష్ట్రాన్ని నంబర్ వన్గా తయారు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, అందుకు ఎమ్మెల్యేలు కూడా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. “నేను ఎమ్మెల్యేల వైపు కాదు, ప్రజల వైపే ఉంటాను” అని స్పష్టం చేశారు.
తాజాగా ముంబైలో తనకు వచ్చిన బిజినెస్ రిఫార్మర్ అవార్డు గురించి చంద్రబాబు మాట్లాడుతూ, అది తనకే కాదు రాష్ట్రానికి, అధికారులకు వచ్చిన గుర్తింపు అని పేర్కొన్నారు. “నేను టీమ్ లీడర్ను. టీమ్ బాగా పని చేస్తేనే నాకు పేరు వస్తుంది” అని అన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణం, పారిశ్రామిక కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. మహిళల కోసం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి చేస్తామని, 2028 నాటికి కృష్ణా పుష్కరాల సమయానికి కృష్ణా జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బందరు పోర్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. విశాఖ తర్వాత అభివృద్ధి, ఆదాయం పరంగా కృష్ణా జిల్లా రెండో స్థానంలో ఉందని చెప్పారు.
అమరావతి నిర్మాణంపై మాట్లాడిన ఆయన.. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం వల్లే రాజధాని అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. రెండో దశలో కూడా రైతులు భూములు ఇవ్వడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని, వారి ఋణం తీర్చుకుంటానని తెలిపారు. ఇక ప్రతిపక్ష నేతపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు, గతంలో రాష్ట్ర అభివృద్ధికి భంగం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తానికి, ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, కార్మిక సంక్షేమం, మరియు భవిష్యత్ ప్రణాళికలపై తన దృష్టిని స్పష్టంగా వివరించారు.
తాజావార్తలు
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!