CM Chandrababu: రైతులకు గుడ్న్యూస్.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.. “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బాపట్ల జిల్లా వేమూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయడంతో పాటు నేరుగా వారితో సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22.79 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం రైతులకు అందజేసింది. రాష్ట్రంలో మొత్తం 16,816 గ్రామాల్లో రీ-సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభం నుంచే రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తోంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
జనవరిలో 4,783 గ్రామాల్లో 18.77 లక్షల పాస్ పుస్తకాలు, ఫిబ్రవరిలో 279 గ్రామాల్లో 1,16,129 పాస్ పుస్తకాలు, మార్చిలో 299 గ్రామాల్లో 1,29,298 పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ప్రభుత్వం, మొత్తం జనవరి నుంచి ఇప్పటి వరకు 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పాస్ పుస్తకాలను అందజేసింది. మార్చి 2027 నాటికి 7,518 సిగ్నల్ గ్రామాల్లో 47 లక్షల పాస్ పుస్తకాలు, ఏప్రిల్ 2027 నాటికి 2,438 నాన్-సిగ్నల్ గ్రామాల్లో 15 లక్షలకు పైగా పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రణాళిక ఉంది. మొత్తంగా 9,956 గ్రామాల్లో 62,04,000 కొత్త పాస్ పుస్తకాలను అందించనుంది ప్రభుత్వం.
ఇవాళ బాపట్ల జిల్లాలోని 8 మండలాల్లో 3,658 పాస్ పుస్తకాలు, వేమూరు నియోజకవర్గంలో 1,795 పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. రైతులకు తెలియకుండా భూ రికార్డుల్లో మార్పులు జరగకుండా ప్రభుత్వం బ్లాక్చైన్ టెక్నాలజీని అమలు చేస్తోంది. ఈ విధానంతో రికార్డులను తారుమారు చేయడం అసాధ్యమని అధికారులు పేర్కొంటున్నారు.
సీఎం టూర్ షెడ్యూల్
సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం, ఉదయం 10.50 గంటలకు భట్టిప్రోలు మండలం సూరేపల్లికి చేరుకొని, 11.00 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.35 గంటలకు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 2.10 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం జరిపి, సాయంత్రం 4.05 గంటలకు అమరావతికి తిరిగి చేరుకుంటారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు భూ హక్కుల భద్రతను కల్పించడం, పారదర్శక భూ రికార్డుల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం అవుతోంది.
తాజావార్తలు
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!