Ganta Srinivasa Rao: పంచ గ్రామాల ప్రజలకు సీఎం గుడ్న్యూస్
- పంచగ్రామాల ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త..
- త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం..
- బాధితులకు పట్టాలు పంపిణీ చేస్తామన్న గంటా శ్రీనివాసరావు..
Ganta Srinivasa Rao: పంచగ్రామాల ప్రజలకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ విషయాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.. పంచగ్రామాల ప్రజలకు సీఎం గుడ్న్యూస్ చెప్పారు.. త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తాం అన్నారు.. పంచ గ్రామల సమస్య ఉన్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులుతో పంచగ్రామాల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కోర్టులలో ఉన్న వివాదాలను విత్ డ్రా చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయన్నారు గంటా శ్రీనివాసరావు.. అనువంశిక ధర్మకర్త కూడా ఆలయ భూములకు ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు అంగీకరించారన్నారు.. దేవాదాయ శాఖ అధికారులు స్థానిక జిల్లా యంత్రాంగంతో కలిసి త్వరలోనే వివాదాలన్నీ పరిష్కరిస్తారన్నారు గంటా శ్రీనివాసరావు.
Read Also: Steve Smith: అరుదైన మైలురాయికి అందుకున్న స్టీవ్ స్మిత్.. రికార్డులే రికార్డులు!
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
కాగా, విశాఖపట్నంలోని సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అడివివరం, వెంకటాపురం, చీమలాపల్లి, పురుషోత్తపురం, వేపగుంట గ్రామాలు అవే పంచ గ్రామాల పరిధిలో 11,282 ఎకరాల భూమి ఉంది. ఇందులో గతంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించాలని భావించి.. 2005లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. 2008లో మరోసారి పరిశీలన చేసి, 421.03 ఎకరాల్లో 12,149 నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. ఆ భూమికి ప్రత్యామ్నాయంగా 547.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు 2014లో కలెక్టర్ ప్రభుత్వానికి లేఖరాశారు. ఈ ప్రత్యామ్నాయ భూమి ఆలయానికి ఇచ్చి, ఆ నిర్మాణాలు క్రమబద్ధీకరణకు 2015లో మంత్రివర్గం ఆమోదించింది. ఇక, దీనిపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు.. అలా సుదీర్ఘకాలంగా పెండింగ్లో పడిన సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. దీనిపై ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగగా.. ఈ రోజు పంచ గ్రామాల సమస్యపై సమీక్ష నిర్వహిచారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో