Ganta Srinivasa Rao: పంచ గ్రామాల ప్రజలకు సీఎం గుడ్న్యూస్
- పంచగ్రామాల ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త..
- త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం..
- బాధితులకు పట్టాలు పంపిణీ చేస్తామన్న గంటా శ్రీనివాసరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganta Srinivasa Rao: పంచగ్రామాల ప్రజలకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ విషయాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.. పంచగ్రామాల ప్రజలకు సీఎం గుడ్న్యూస్ చెప్పారు.. త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తాం అన్నారు.. పంచ గ్రామల సమస్య ఉన్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులుతో పంచగ్రామాల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కోర్టులలో ఉన్న వివాదాలను విత్ డ్రా చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయన్నారు గంటా శ్రీనివాసరావు.. అనువంశిక ధర్మకర్త కూడా ఆలయ భూములకు ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు అంగీకరించారన్నారు.. దేవాదాయ శాఖ అధికారులు స్థానిక జిల్లా యంత్రాంగంతో కలిసి త్వరలోనే వివాదాలన్నీ పరిష్కరిస్తారన్నారు గంటా శ్రీనివాసరావు.
Read Also: Steve Smith: అరుదైన మైలురాయికి అందుకున్న స్టీవ్ స్మిత్.. రికార్డులే రికార్డులు!
Also Read
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
కాగా, విశాఖపట్నంలోని సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అడివివరం, వెంకటాపురం, చీమలాపల్లి, పురుషోత్తపురం, వేపగుంట గ్రామాలు అవే పంచ గ్రామాల పరిధిలో 11,282 ఎకరాల భూమి ఉంది. ఇందులో గతంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించాలని భావించి.. 2005లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. 2008లో మరోసారి పరిశీలన చేసి, 421.03 ఎకరాల్లో 12,149 నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. ఆ భూమికి ప్రత్యామ్నాయంగా 547.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు 2014లో కలెక్టర్ ప్రభుత్వానికి లేఖరాశారు. ఈ ప్రత్యామ్నాయ భూమి ఆలయానికి ఇచ్చి, ఆ నిర్మాణాలు క్రమబద్ధీకరణకు 2015లో మంత్రివర్గం ఆమోదించింది. ఇక, దీనిపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు.. అలా సుదీర్ఘకాలంగా పెండింగ్లో పడిన సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. దీనిపై ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగగా.. ఈ రోజు పంచ గ్రామాల సమస్యపై సమీక్ష నిర్వహిచారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..