Ganta Srinivasa Rao: పంచ గ్రామాల ప్రజలకు సీఎం గుడ్న్యూస్
- పంచగ్రామాల ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త..
- త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం..
- బాధితులకు పట్టాలు పంపిణీ చేస్తామన్న గంటా శ్రీనివాసరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganta Srinivasa Rao: పంచగ్రామాల ప్రజలకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ విషయాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.. పంచగ్రామాల ప్రజలకు సీఎం గుడ్న్యూస్ చెప్పారు.. త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తాం అన్నారు.. పంచ గ్రామల సమస్య ఉన్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులుతో పంచగ్రామాల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కోర్టులలో ఉన్న వివాదాలను విత్ డ్రా చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయన్నారు గంటా శ్రీనివాసరావు.. అనువంశిక ధర్మకర్త కూడా ఆలయ భూములకు ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు అంగీకరించారన్నారు.. దేవాదాయ శాఖ అధికారులు స్థానిక జిల్లా యంత్రాంగంతో కలిసి త్వరలోనే వివాదాలన్నీ పరిష్కరిస్తారన్నారు గంటా శ్రీనివాసరావు.
Read Also: Steve Smith: అరుదైన మైలురాయికి అందుకున్న స్టీవ్ స్మిత్.. రికార్డులే రికార్డులు!
Also Read
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
కాగా, విశాఖపట్నంలోని సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అడివివరం, వెంకటాపురం, చీమలాపల్లి, పురుషోత్తపురం, వేపగుంట గ్రామాలు అవే పంచ గ్రామాల పరిధిలో 11,282 ఎకరాల భూమి ఉంది. ఇందులో గతంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించాలని భావించి.. 2005లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. 2008లో మరోసారి పరిశీలన చేసి, 421.03 ఎకరాల్లో 12,149 నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. ఆ భూమికి ప్రత్యామ్నాయంగా 547.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు 2014లో కలెక్టర్ ప్రభుత్వానికి లేఖరాశారు. ఈ ప్రత్యామ్నాయ భూమి ఆలయానికి ఇచ్చి, ఆ నిర్మాణాలు క్రమబద్ధీకరణకు 2015లో మంత్రివర్గం ఆమోదించింది. ఇక, దీనిపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు.. అలా సుదీర్ఘకాలంగా పెండింగ్లో పడిన సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. దీనిపై ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగగా.. ఈ రోజు పంచ గ్రామాల సమస్యపై సమీక్ష నిర్వహిచారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!