Cyclone Montha: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..
- తుఫాన్ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..
- పునరావాస శిబిరాలలో ఉన్నవారికి తక్షణ ఆర్థిక సాయం..
- మనిషికి వెయ్యి రూపాయల చొప్పున నగదు..
- కుటుంబానికి గరిష్టంగా రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Montha: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని ఓడలరేవు గ్రామంలో తుఫాన్ పునరావాస కేంద్రాలను సందర్శించిన సీఎం చంద్రబాబు.. పునరవాస కేంద్రాలలో ప్రజలతో మాట్లాడారు.. ప్రజలకు నిత్యవసరాలతో పాటు బియ్యం కూడా అందజేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు… అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తుఫాన్ ఎఫెక్ట్ తో ప్రాణనష్టం జరగకుండా అర్ధరాత్రి వరకు మానిటర్ చేశాం.. వరి పంట కొంతవరకు దెబ్బతింది.. హార్టికల్చర్ కొంతవరకు దెబ్బతింది.. మరికొన్ని జిల్లాల్లో ఈరోజు కూడా తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి… ఒక్కోచోట ఒక్కో విధంగా తుఫాను ప్రభావితం ఉండడంతో పూర్తిగా అంచనా వేయడానికి కాస్త సమయం పడుతుందన్నారు.. అయితే, రెండు నుంచి మూడు రోజులు రిహాబిడేషన్ సెంటర్స్ లో ఉన్నవారికి 3000 రూపాయలతో పాటు నిత్యవసరాలు, బియ్యం అలాగే మత్స్యకారులు వేట నిషేధం విధించాం కాబట్టి 50 కేజీల బియ్యం.. అలాగే చేనేతలకు కూడా బియ్యం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.. పునరావాస శిబిరాలలో ఉన్నవారికి తక్షణ ఆర్థిక సాయం కింద మనిషికి వెయ్యి రూపాయల నగదు చొప్పున.. కుటుంబానికి గరిష్టంగా రూ.3 వేల చొప్పున అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Montha Cyclone : ఖమ్మం, భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లో తుఫాన్ కేంద్రీకృతం
Also Read
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీరప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు సీఎం చంద్రబాబు.. ఓడలరేవు ఓఎంజీసీ టెర్మినల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి.. ఓడలరేవులోని తుఫాన్ పునరవాసి కేంద్రాలను పరిశీలించారు.. తుఫాన్ బాధితులను పరామర్శించారు.. రోడ్డు మార్గం ద్వారా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చేరుకున్న చంద్రబాబు.. తుఫాన్ కు నేలకొరిగిన వరి పొలాలు పరిశీలించారు.. పంట నష్టాలకు సంబంధించి రైతులను అడిగి తెలుసుకున్నారు.. వరి పైరు నేలకొరిగి పోవడంతో దిగుబడి తగ్గిపోతుందని ముఖ్యమంత్రి ఎదుట వాపోయారు రైతులు.. ఎకరానికి 20 నుండి 30 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతులు సీఎం చంద్రబాబు ఎదుట వాపోయారు..
తాజావార్తలు
-
COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!