CM Chandrababu: ముగిసిన కూటమి శాసన సభాపక్ష భేటీ.. ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం..
- ముగిసిన కూటమి శాసన సభాపక్ష సమావేశం..
- ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు..
- 150 రోజుల పాలనలో చేసిన అన్ని అంశాలపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కూటమి శాసన సభాపక్ష సమావేశం ముగిసింది.. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసన సభాపక్ష భేటీలో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 150 రోజుల పాలనలో చేసిన అన్ని అంశాలపై చర్చ సాగింది.. మంత్రులు.. ఎమ్మెల్యేలకు అన్ని విషయాలలో సహకరించాలని సూచించారు.. ఎమ్మెల్యేలు అందరూ హుందాగా ఉండటం అలవాటు చేసుకోవాలన్న ఆయన.. ప్రతిపక్షం లేదని నిర్లక్ష్య ధోరణి వద్దు అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు.. మరింత జోరుగా ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని దిశా నిర్దేశం చేశారు.. పాలసీలు అన్నీ క్షేత్రస్ధాయిలో అమలయ్యేలా ఎమ్మెల్యేలు చూడాలన్నారు.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యాటక అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారు.. ఎమ్మెల్యేలు ప్రతీ సమస్యనూ కచ్చితంగా చర్చించాలన్న సీఎం.. ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీలో సమస్యలపై చర్చ జరగాలన్నారు.
Read Also: AI Adoption: ప్రపంచంతో పోలిస్తే, AIని తెగవాడుతున్న ఇండియా….
Also Read
- Gangamma Lockup Death Case: గంగమ్మ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు కీలక ప్రశ్నలు
- Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
- Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
ఇక, ఇసుక విషయంలో అక్రమాలు జరగకూడదు.. ఇసుక పాలసీ అమలు విషయంలో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, అంతకు ముందు అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఎమ్మెల్యేల అవగాహన సదస్సులోనూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం.. ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందని.. ఇది మంచిది కాదని… నిరంతరం నేర్చుకోవాలి… తెలుసుకోవాలని హితవు చెప్పారు.. ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నాను అన్నారు.. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు… కానీ మనకు ఉంది. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. ప్రజలకు ఏం అవసరమో… ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీకి మేము పంపిన ప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు అని సూచించారు.. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరని.. గతంలో అదే జరిగిందని హెచ్చరించారు.. శాఖల్లో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేలకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో తెలియదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Green Card Holders: గ్రీన్ కార్డ్ హోల్డర్లకు షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
Trump: హార్ముజ్పై ఇరాన్ హామీ ఇచ్చింది.. లేదంటే చర్చలు ముగుస్తాయని ట్రంప్ హెచ్చరిక
-
Ketan Agarwal Case: సోదరి అనుమానం, పోలీసుల విచారణ.. కేతన్ హత్య కేసులో సియా ఎలా దొరికింది..?
-
Gangamma Lockup Death Case: గంగమ్మ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు కీలక ప్రశ్నలు
-
Hyderabad Water Alert : హైదరాబాద్ వాసులకు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!