Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్మోండేలో ఒక సాధారణ డ్రైనేజీ పైప్లైన్ తవ్వకం పనుల్లో నిమగ్నమైన నిర్మాణ కార్మికులకు ఒక అరుదైన నిధి దొరికింది. దాదాపు 9 మిలియన్ యూరోలు (సుమారు రూ. 98 కోట్లు) విలువైన బంగారు బిస్కెట్లు, అరుదైన నాణేల నిల్వ ఈ తవ్వకాలలో బయటపడింది. వేసవి సెలవుల్లో పనికి వచ్చిన 18 ఏళ్ల విద్యార్థి కోబ్ ఈ నిధిని మొదటగా గుర్తించాడు. పైపులు తొలగిస్తుండగా ఏదో మెరుస్తూ కనిపించిందని, మొదట అవి సాధారణ నాణేలు అనుకున్నామని, కానీ పరిశీలిస్తే బంగారు బిస్కెట్లు, పురాతన నాణేలతో ఉన్న పెద్ద సంచిగా తేలిందని అతను తెలిపాడు.
ఈ బంగారు నిధి 19వ శతాబ్దం చివరలో నిర్మించిన ఒక పురాతన భవనం క్రింద ఉన్న ఇటుకల గోడ మధ్య దాచి ఉంచబడి ఉంది. ఈ భవనం గతంలో ప్రముఖ వ్యాపారి థియోఫిలస్ వాన్ అస్చేకి చెందిన ఒక బ్రూవరీగా ఉండేది. ఇక్కడ 1899 నుంచి 1970 వరకు పానీయాల తయారీ జరిగింది. ప్రస్తుతం ఈ చారిత్రక భవనాన్ని ‘CAW ఓస్ట్-విలాండెరెన్’ అనే సామాజిక సంక్షేమ సంస్థ తమ కొత్త ఆఫీసులు, నివాసాల కోసం పునరుద్ధరిస్తోంది. పనులు జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఈ నిధి వెలుగులోకి వచ్చింది.
Also Read
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Siddipet District: కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, లభించిన బంగారాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ బంగారం వెనుక ఉన్న చట్టపరమైన హక్కుదారులను గుర్తించడానికి తూర్పు ఫ్లాండర్స్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ఈ బంగారం ఏదైనా నేరంతో సంబంధం ఉన్నదా లేదా దొంగిలించబడిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.
బెల్జియం చట్టాల ప్రకారం.. దొరికిన నిధిపై హక్కు దావా వేయడానికి అసలైన యజమానులకు ఐదేళ్ల సమయం ఉంటుంది. ప్రస్తుతం ఈ నిధిపై నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు, సంక్షేమ సంస్థ, వాన్ అస్చే వారసులు హక్కులు కోరే అవకాశం ఉంది. భారీ మొత్తంలో లభించినందున చట్టపరంగా అధికారులకు అప్పగించామని, భవిష్యత్తులో తమకు ఏదైనా రివార్డు రూపంలో ప్రతిఫలం దక్కుతుందేమో వేచి చూడాలని కార్మికుడు కోబ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!