CM Chandrababu Serious: ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. లైన్ దాటొద్దు..!
- ముగ్గురు ఎమ్మెల్యే లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..
- తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు...
- ప్రిన్సిపాల్ వ్యవహారంలో కూన రవికుమార్పై అసంతృప్తి..
- జూ.ఎన్టీఆర్ పై వ్యాఖ్యల విషయంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై సీరియస్..
- గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే వీడియో కాల్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి..
- ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై నివేదిక కోరిన చంద్రబాబు....
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Serious: ఎవరు కూడా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు .. ఈ మధ్యకాలంలో ఏ సందర్భం దొరికిన ఎమ్మెల్యేలు పనితీరు గురించే సీఎం చంద్రబాబు పర్రస్తావిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు ఇబ్బందికరంగా ఉందంటూ… ఇప్పటికే చాలాసార్లు సీఎం చంద్రబాబు హెచ్చరించారు.. చాలా మీటింగుల్లో చెప్పారు.. కానీ, ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరులో ఏమాత్రం మార్పు రావట్లేదు. తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు… ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ను హెచ్చరించారు సీఎం చంద్రబాబు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. లేటెస్టుగా కూన రవికుమార్ తీరుపై ఓ మహిళ ప్రిన్సిపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేధింపులు ఎక్కువయ్యాయని తనను అనవసరంగా వేధిస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు.. దీనిపై కూన రవికుమార్ క్లారిటీ ఇచ్చారు.. విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, వారికి ఉపయోగించాల్సిన నిత్యావసరాలను దారి మళ్లించడం వంటి అంశాలను ప్రశ్నించినందుకు, ప్రిన్సిపల్ వైసీపీ నేతలతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కూన.. తల్లికి వందనం కార్యక్రమంపై ముగ్గురు ప్రిన్సిపల్స్తో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కేవలం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్తోనే వీడియో కాల్ తీసుకున్నట్లు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Read Also: MEGA 157 : మెగాస్టార్ సినిమా టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.. అదిరిందిగా
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇక, జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మంచిది కాదన్నారు..చంద్రబాబు.. జనంలో ఈ రకమైన వ్యాఖ్యలు.. తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఉంటాయన్నారు… ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారంపై కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు… వీడియో కాల్స్ అసభ్య పదజాలం.. అసభ్యకరమైన వీడియోలు ఉంటే .. ఆ ఎమ్మెల్యేల మీద జనంలో చులకన భావం కలిగిస్తుందని ఇలాంటి విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది … మొన్న ఆగస్టు 15న కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుర్చీ విషయంలో అధికారి మీద సీరియస్ అయిన పరిస్థితి.. ఇలాగే ప్రతి జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యే ల వ్యవహార శైలి.. సీఎంకు ఇబ్బంది కలిగిస్తోంది.. ఎమ్మెల్యేల వ్యవహరి శైలి పై ఇప్పటికే చాలా సందర్భాల్లో హెచ్చరించారు చంద్రబాబు…
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!