ఎమ్మెల్యేలు మాట వినకపోతే ఇక మాటల్లేవ్... అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇకపై మాటల్లేవ్... యాక్షన్ మాత్రమే ఉంటుందన్నారు.. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సరిచేసుకోమని ఒకసారి చెప్తా అన్నారు.. అయినా తీరు మారకుంటే రెండో సారి పిలిచి చెప్తా..., అప్పటికీ మారకుంటే ఇక చెప్పటాలుండవు, నేను తీసుకోవాల్సిన చర్య తీసుకుంటా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు..
పార్టీ లైన్ దాటొద్దు.. వివాదాస్పదంగా ప్రవర్తించి.. పార్టీకి ఇబ్బంది కలిగించొద్దు.. ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తాయంటూ చంద్రబాబు పదేపదే క్లాస్ పీకుతున్నా.. కొందరు ఎమ్మెల్యేల తీరు మారడం లేదు. లేటెస్టుగా ఎమ్మెల్యేలు కూన రవి,దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, నజీర్ ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురి వ్యవహారశైలిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.