వేర్వేరు వార్తలు ఇద్దరు దర్శకుల్ని, ఓ యాక్టర్ను ఇరుకున పడేశాయి. దీంతో స్వయంగా వాళ్లే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. స్పిరిట్ నుండి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని సోషల్ మీడియా కోడై కూసింది. సందీప్ రెడ్డి వంగాతో క్రియేటివ్ డిఫరెన్స్ అంటూ కథలు పుట్టుకొచ్చాయి. ఈ న్యూస్ నాన్సెస్స్గా మారడంతో ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగాడు. ఇంకా తన మీద షూటే స్టార్టే కాలేదు వాట్సప్ ఫ్యాక్టరీ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.
Also Read : RajPal Yadav : తిహార్ జైలుకు స్టార్ కమెడియన్
ధనుష్ ఇళయరాజా బయోపిక్ ఎనౌన్స్ చేసి రెండు ఏళ్లు అవుతోంది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ధనుష్ ఇతర ప్రాజెక్ట్స్ వల్ల బిజీగా ఉండటంతో.. అరుణ్ మాథేశ్వరన్ కూడా లోకేశ్ కనగరాజ్ను హీరోగా పరిచయం చేసే పని పెట్టుకున్నాడు. హోల్టైన ఈ ప్రాజెక్ట్ నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ నుండి పట్టాలెక్కబోతుందట. అయితే ఈ సినిమా నుండి అరుణ్ బయటకు వెళ్లాడని, కొత్త దర్శకుడి ఇన్ కాబోతున్నాడని కోలీవుడ్లో వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో అరుణ్/ ధనుష్ టీం స్పందించింది. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, డీసీ మూవీ కంప్లీట్ కాగానే.. బయోపిక్కి అరుణ్ షిఫ్ట్ అవుతాడని వెల్లడించింది. రోహిత్ శెట్టి అప్ కమింగ్ ఫిల్మ్ గోల్ మాల్5 దో ఔర్ దో పాంచ్ రీమేక్ అంటూ ఓ న్యూస్ స్ప్రెడ్ కాగా, ఇది ఒరిజినల్ స్టోరీ అంటూ దర్శకుడు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి వార్తలు రాసే ముందు మా అధికారిక వెబ్ సైట్స్ పరిశీలించాలంటూ మీడియా, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్కు టీం విన్నవించింది. తప్పుడు కథనాలు రాస్తే.. లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది.