Andhra Pradesh: భారీ వర్షాలు.. సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు..
- భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు..
- ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చు..
- పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దు..
- టార్గెట్లు పెట్టవద్దని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఒకరోజు ముందుగానే పెన్షన్దారులకు గుడ్న్యూస్ చెబుతూ.. తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీని చేపట్టింది ప్రభుత్వం.. ఇంటి వద్దుకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అధికారులు.. అయితే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు ఉద్యోగులు.. ఇక, భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చు అన్నారు సీఎం.. పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని.. టార్గెట్లు పెట్టవద్దని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. అయితే, వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Read Also: Farmers Protest 200 Days: నేడు శంభు సరిహద్దులో రైతుల భారీ నిరసన.. పాల్గొన్న వినేష్ ఫోగట్
Also Read
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
మరోవైపు.. పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది.. ఇప్పటికే 50 శాతానికి పైగా పెన్షన్లను అందజేశారు సచివాలయాల సిబ్బంది. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షమ్ల పంపిణీ ప్రారంభం అయ్యింది.. మొత్తం 64,61,485 పెన్షన్ లబ్ధిదారులకు రూ. 2729.86 కోట్లను పంపిణీ చేయనుంది కూటమి సర్కార్.. ఇప్పటి వరకు 56 శాతం మేర పెన్షన్ల పంపిణీ చేపట్టారు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది. పెన్షన్ల పంపిణీలో టాప్-3లో శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు నిలవగా.. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది.. జోరు వర్షంలోనూ ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపడుతున్నారు సచివాలయాల సిబ్బంది. రేపు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ జరుగుతోంది. అయితే, వర్షాల నేపథ్యంలో.. సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!