Amaravati: నేటి నుంచి ఏపీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం
- నేటి నుంచి ఏపీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం
- కుప్పంలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వృద్ధాప్య పెన్షన్, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఈ విషయాలను ప్రభుత్వ ప్రజలకు వివరించనుంది.
ఇది కూడా చదవండి: ENG vs IND: నేటి నుంచే రెండో టెస్టు.. సందిగ్ధంలో భారత్! కలిసిరాని ఎడ్జ్బాస్టన్
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ఇక వచ్చే ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీస బస్సు ప్రయాణం కల్పించనుంది. దీన్ని కూడా మహిళలకు వివరించనున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల కోసం రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. దీన్ని కూడా కూటమి నేతలు వివరించనున్నారు. నెరవేర్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో జరిగిన అభివృద్ధిపై ఇంటింటికి తిరిగి కూటమి నేతలు వివరించనున్నారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: నేడు జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదలయ్యే ఛాన్స్
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటన కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్కు చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:50 గంటలకు శాంతిపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ దగ్గరకు రోడ్డు మార్గాన చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక సాయంత్రం 4:35 గంటలకు తిమ్మరాజుపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఏడాదిగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించనున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఇక రాత్రి 7:05 గం.లకు శాంతిపురం మండలంలోని సొంత ఇంటికి వెళ్లనున్నారు. రాత్రికి శివపురంలో ఉన్న ఇంట్లో బస చేయనున్నారు.
రెండో రోజు సీఎం పర్యటన వివరాలు..
ఇక గురువారం ఉదయం 10:35 గంటలకు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో టాటా డీఐఎన్సీ సెంటర్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటల నుంచి అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అవుతారు. సాయంత్రం 4:10 గంటలకు హెలిపాడ్ నుంచి తిరుగుప్రయాణం అవుతారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!