Amaravati: నేటి నుంచి ఏపీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం
- నేటి నుంచి ఏపీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం
- కుప్పంలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వృద్ధాప్య పెన్షన్, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఈ విషయాలను ప్రభుత్వ ప్రజలకు వివరించనుంది.
ఇది కూడా చదవండి: ENG vs IND: నేటి నుంచే రెండో టెస్టు.. సందిగ్ధంలో భారత్! కలిసిరాని ఎడ్జ్బాస్టన్
Also Read
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
- Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
ఇక వచ్చే ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీస బస్సు ప్రయాణం కల్పించనుంది. దీన్ని కూడా మహిళలకు వివరించనున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల కోసం రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. దీన్ని కూడా కూటమి నేతలు వివరించనున్నారు. నెరవేర్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో జరిగిన అభివృద్ధిపై ఇంటింటికి తిరిగి కూటమి నేతలు వివరించనున్నారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: నేడు జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదలయ్యే ఛాన్స్
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటన కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్కు చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:50 గంటలకు శాంతిపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ దగ్గరకు రోడ్డు మార్గాన చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక సాయంత్రం 4:35 గంటలకు తిమ్మరాజుపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఏడాదిగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించనున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఇక రాత్రి 7:05 గం.లకు శాంతిపురం మండలంలోని సొంత ఇంటికి వెళ్లనున్నారు. రాత్రికి శివపురంలో ఉన్న ఇంట్లో బస చేయనున్నారు.
రెండో రోజు సీఎం పర్యటన వివరాలు..
ఇక గురువారం ఉదయం 10:35 గంటలకు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో టాటా డీఐఎన్సీ సెంటర్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటల నుంచి అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అవుతారు. సాయంత్రం 4:10 గంటలకు హెలిపాడ్ నుంచి తిరుగుప్రయాణం అవుతారు.
తాజావార్తలు
-
Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
-
Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
-
RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!