CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలంటే పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయిన సమయంలో హైదరాబాద్లో పెద్దగా ఆసుపత్రులు లేకపోయాయని గుర్తు చేశారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కోడెల శివప్రసాద్ రావు ను గల్ఫ్ దేశాలకు పంపించి అక్కడి హాస్పిటాలిటీ వ్యవస్థను అధ్యయనం చేయించామని తెలిపారు. ఆ సమయంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్లే హైదరాబాద్ దేశానికి మెడికల్ హబ్గా మారిందన్నారు.
ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వైద్యులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేర్చుకుంటూ తమ రంగంలో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు, యువతలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే తాను కలలు గన్న అమరావతి నిర్మాణం సాకారం అవుతోందని చంద్రబాబు అన్నారు. ఇటీవల శంఖుస్థాపన చేసిన యూనివర్సిటీ ద్వారా లక్ష వరకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం వెల్లడించారు. 2027 నాటికి యూనివర్సిటీ భవనం పూర్తవుతుందని, ఆ భవనాన్ని తానే ప్రారంభిస్తానని పేర్కొన్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
విశాఖపట్నంలో కూడా భారీ పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం తెలిపారు. వచ్చే ఆగస్టు 15 కంటే ముందుగానే Google విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు. అలాగే ArcelorMittal సంస్థ 2028 డిసెంబర్ నాటికి తన తొలి దశ పనులను విశాఖ వేదికగా పూర్తి చేస్తుందని వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం ఆటోపైలెట్ విధానంలో ఇస్తుందని, నిర్ణీత గడువులో నిర్మాణం పూర్తి చేయడం మాత్రం సంస్థ బాధ్యత అని స్పష్టం చేశారు. వైద్య రంగంలో డాక్టర్ల కంటే నర్సుల పాత్ర ఎంతో కీలకమని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ కంటే మెరుగైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నగరం ఎంత అభివృద్ధి చెందితే ప్రజల భవిష్యత్తు అంత బాగుంటుందని పేర్కొన్నారు. కృష్ణా నదిపై మరిన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తే అమరావతి అద్భుత నగరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతి మాత్రమే కాకుండా విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. “రాళ్లసీమను రత్నాల సీమగా మారుస్తాం” అంటూ సీఎం చంద్రబాబు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!