CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అమరావతిలో ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకత్వం, ప్రజా ప్రతినిధుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ప్రజల్లో పార్టీపై విశ్వాసం మరింత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా కాకుండా జట్టుగా పనిచేసే సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. కొంతమంది నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తాజా సర్వేల్లో వెల్లడైందని చంద్రబాబు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని పార్టీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, సర్వేల్లో ప్రతికూలంగా ఉన్న నేతలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే, వారి వ్యక్తిగత వ్యవహారాల వల్ల పార్టీకి నష్టం జరిగే పరిస్థితిని మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
కొంతమంది అధికారుల పనితీరులో కూడా లోపాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. అలాంటి అధికారులను కూడా గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 1999 ఎన్నికలను ప్రస్తావించిన చంద్రబాబు, అప్పట్లో పార్టీకి నష్టం కలిగించే కొంతమంది నేతలను పక్కన పెట్టడం వల్లే విజయం సాధించగలిగామని గుర్తు చేశారు. పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన సంకేతాలిచ్చారు.
Also Read
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
సమావేశంలో కొందరు ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారని, పార్టీ ప్రయోజనాల కోసం సూచనలు చేస్తే కొందరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లి వ్యాఖ్యలు చేస్తున్నారని ఓ ఎంపీ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, ఇలాంటి పరిస్థితులు రాజకీయాల్లో సహజమేనని అన్నారు. తనను కూడా విమర్శించే వారు ఉంటారని, అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోకుండా పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేయాలని నాయకులకు సూచించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!