IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
- లార్డ్స్ వేదికగా జులై 19న మూడో వన్డే మ్యాచ్
- లార్డ్స్ వన్డే ముందు ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం
- ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Release Liam Dawson, Tom Banton: భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్రౌండర్ లియామ్ డాసన్, బ్యాటర్ టామ్ బాంటన్లను లార్డ్స్ వేదికగా జులై 19న జరగనున్న చివరి వన్డేకు ముందే జట్టు నుంచి విడుదల చేసింది. ఈ ఇద్దరూ దేశవాళీ టీ20 బ్లాస్ట్ ఫైనల్లో తమ తమ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. డాసన్, బాంటన్ స్థానంలో కొత్త ఆటగాళ్లను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేయలేదు.
మొదటి వన్డేలో లియామ్ డాసన్ అద్భుత హాఫ్ సెంచరీ (68)తో ఆకట్టుకున్నాడు. జో రూట్తో కలిసి 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూపర్ నాక్ ఆడినా రెండో వన్డేలో తుది జట్టులో మాత్రం అతడికి అవకాశం దక్కలేదు. దీంతో తన కౌంటీ జట్టు హాంప్షైర్ తరఫున ఎస్సెక్స్పై జరిగిన టీ20 బ్లాస్ట్ క్వార్టర్ ఫైనల్ను ఆడలేకపోయాడు. మరోవైపు టామ్ బాంటన్కు సిరీస్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ విడుదల చేసి టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ డేలో పాల్గొనేందుకు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ అనుమతించింది.
Also Read
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
- India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
- ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ డేలో తొలి సెమీఫైనల్లో సోమర్సెట్, నార్తాంప్టన్షైర్ స్టీల్బ్యాక్స్ తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్లో హాంప్షైర్ హాక్స్, నాట్స్ అవుట్లాస్ మధ్య పోరు జరగనుంది. ఈ రెండు మ్యాచ్ల విజేతలు అదే రోజు సాయంత్రం ఎడ్జ్బాస్టన్లో జరిగే ఫైనల్లో ట్రోఫీ కోసం పోటీపడతాయి. లార్డ్స్ వన్డేకు ముందు ఇంగ్లండ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను సమం చేసింది. కార్డిఫ్లో జరిగిన రెండో మ్యాచ్లో విరాట్ కోహ్లీ (65), శ్రేయస్ అయ్యర్ (66) అర్ధశతకాలతో రాణించినా.. మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో భారత్ 233 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసి ఇంగ్లండ్కు అద్భుత విజయాన్ని అందించాడు.
తాజావార్తలు
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!