IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
- లార్డ్స్ వేదికగా జులై 19న మూడో వన్డే మ్యాచ్
- లార్డ్స్ వన్డే ముందు ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం
- ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Release Liam Dawson, Tom Banton: భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్రౌండర్ లియామ్ డాసన్, బ్యాటర్ టామ్ బాంటన్లను లార్డ్స్ వేదికగా జులై 19న జరగనున్న చివరి వన్డేకు ముందే జట్టు నుంచి విడుదల చేసింది. ఈ ఇద్దరూ దేశవాళీ టీ20 బ్లాస్ట్ ఫైనల్లో తమ తమ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. డాసన్, బాంటన్ స్థానంలో కొత్త ఆటగాళ్లను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేయలేదు.
మొదటి వన్డేలో లియామ్ డాసన్ అద్భుత హాఫ్ సెంచరీ (68)తో ఆకట్టుకున్నాడు. జో రూట్తో కలిసి 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూపర్ నాక్ ఆడినా రెండో వన్డేలో తుది జట్టులో మాత్రం అతడికి అవకాశం దక్కలేదు. దీంతో తన కౌంటీ జట్టు హాంప్షైర్ తరఫున ఎస్సెక్స్పై జరిగిన టీ20 బ్లాస్ట్ క్వార్టర్ ఫైనల్ను ఆడలేకపోయాడు. మరోవైపు టామ్ బాంటన్కు సిరీస్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ విడుదల చేసి టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ డేలో పాల్గొనేందుకు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ అనుమతించింది.
Also Read
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ డేలో తొలి సెమీఫైనల్లో సోమర్సెట్, నార్తాంప్టన్షైర్ స్టీల్బ్యాక్స్ తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్లో హాంప్షైర్ హాక్స్, నాట్స్ అవుట్లాస్ మధ్య పోరు జరగనుంది. ఈ రెండు మ్యాచ్ల విజేతలు అదే రోజు సాయంత్రం ఎడ్జ్బాస్టన్లో జరిగే ఫైనల్లో ట్రోఫీ కోసం పోటీపడతాయి. లార్డ్స్ వన్డేకు ముందు ఇంగ్లండ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను సమం చేసింది. కార్డిఫ్లో జరిగిన రెండో మ్యాచ్లో విరాట్ కోహ్లీ (65), శ్రేయస్ అయ్యర్ (66) అర్ధశతకాలతో రాణించినా.. మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో భారత్ 233 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసి ఇంగ్లండ్కు అద్భుత విజయాన్ని అందించాడు.
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!