Election Commission: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్పై స్పందించిన ఈసీ..
- ఈవీఎం ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుపై స్పందించిన ఈసీ..
- ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు..
- మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టే దీనికి నిదర్శనం..
- ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మాజీ ఎమ్మెల్యే అరెస్టు ఒక గుణపాఠం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: ఈవీఎం ధ్వంసం, మరో మూడు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్పై స్పందించింది ఎన్నికల కమిషన్.. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందుకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే నిదర్శమని తెలిపింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబందించి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టి వేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా, ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.. రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఇంక ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈవీఎం డ్యామేజ్కు కారణమైన మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడంతో ఈసీఐ ఆదర్శప్రాయమైన చర్యకు తార్కిక ముగింపు లభించింది. హోదాతో సంబంధం లేకుండా ఎవరూ చట్టానికి అతీతులు కాదనే సూత్రాన్ని ఇది బలపరుస్తుంది. ECI ఎన్నికల ప్రక్రియను పరిరక్షించడానికి కట్టుబడి ఉంది.. ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవటం ఎంతో ఆవశ్యకం. ఈవీఎంలను డ్యామేజ్ చేసిన వారిని అరెస్టు చేయడం అనేది ఎన్నికల సమగ్రతను కాపాడుకోవడంలో ECI యొక్క అంకితభావానికి ఒక నిర్దిష్ట ఉదాహరణగా పేర్కొంది.
Read Also: Vidyasagar Rao: రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇప్పటి కంటే ఎక్కువ సీట్లు..!
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. ఏపీలో మే 13 వ తేదీన పోలింగ్ జరిగింది.. అయితే, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ నెం.202 లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు (ఎమ్మెల్యే) ఉద్దేశపూర్వకంగా ఈవీఎం ధ్వంసం చేయడం నేరపూరిత చర్యగా మాత్రమే కాకుండా.. ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా పరిగణించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికలను నిర్వహించడానికి ఈవీఎంలు మూల స్తంభాలు. అటువంటి ఈవీఎంలను పాడు చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రత దెబ్బతింటుంది, ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది.. ఎన్నికల ఫలితాల చట్టబద్ధతపై సందేహాన్ని కలిగిస్తుంది. దేశంలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించాల్సిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ).. ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణించింది.. ఆదర్శప్రాయమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీడియో ఫుటేజ్ లను పరిశీలించిన తర్వాత, ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని మే 21న ఈసీఐ ఆదేశించింది. ఈ సందర్బంగా మాచర్ల మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదైన ఈ కేసు నుండి తప్పించుకునేందుకు నిందితులు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషనను దాఖలు చేయగా.. ఏపీ హైకోర్టు నేడు ఆ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయంతో ఈవీఎంల ధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..