Rajya Sabha: రాజ్యసభ రేసు..! ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు నేతలు ఎవరు..?
- ఏపీ నుంచి రాజ్యసభ రేసులో ఉన్నదెవరు?..
- పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరన్నదానిపై సస్పెన్స్..
- నాగబాబు కోసం ట్రై చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్..
- టీడీపీ ఈసారి ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఉత్కంఠ..
- ఏపీ బీజేపీ నుంచి కూడా తీవ్రంగా ఉన్న పోటీ..
- ఆ మధ్య సీఎంని కలిసిన కేంద్ర మాజీమంత్రి సురేశ్ ప్రభు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు ఎన్డీఏ కూటమిలో పడటం లాంఛనమే. అయితే రాజ్యసభలో అడుగు పెట్టేది ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపే పనిలోపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. నాగబాబు.. జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు కల్యాణ్కు తోడుగా ఉంటున్నారు. అయితే, లింగమనేని రమేష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ నాగబాబు ఒకే అయితే.. సామాజిక సమీకరణాల్లో భాగంగా టీడీపీ నుంచి రేసులో ఉన్న సానా సతీష్, వంగవీటి రాధకు భంగపాటు తప్పదు. పీఏసీ, కార్పోరేషన్ చైర్మన్ కూడా కాపులకే ఇచ్చారు. ఈ కోణంలో అన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తే ఇబ్బంది అనుకుంటే.. లింగమనేని రమేష్కు ఇచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Pakistan: షియా-సున్నీల మధ్య ఘర్షణ.. 100 మంది మృతి
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఇందులో మాజీ ఎంపీ బీద మస్తాన్రావును టీడీపీ తరపున మళ్లీ పెద్దలకు సభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్లకుపైగా పదవీకాలం ఉండగానే బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి టీడీపీ ఇచ్చిన హామీ మేరకు మస్తాన్రావును రాజ్యసభకు రెండో అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ నుంచి మరికొందరు ఆశావహులు లైన్లో ఉన్నారు. కిలారు రాజేష్, సానా సతీష్, టీడీ జనార్దన్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్, కనకమేడల, అశోక్ గజపతిరాజు వంటి నేతలు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా..? లేదంటే కొత్త అభ్యర్థిని రాజ్యసభకు పంపుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Read Also: Delhi: అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు.. మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ
మరోవైపు కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని సమాచారం. నెల రోజుల ముందే ఇద్దరూ భేటీ అయినట్టు సమాచారం. తనను ఏపీ తరపున నామినేట్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర సహకారం తప్పని పరిస్ధితుల్లో కచ్చితంగా బీజేపీ ఒక రాజ్యసభ సీటు దక్కుతుందని అంటున్నారు. అయితే ఏపీలో కమలం పార్టీ తరపున రాజ్యసభకు అభ్యర్ధులే లేరా అనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఏదేమైనా పెద్దలకు సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరన్నది కొద్ది రోజుల్లో తేలుతుంది. రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10 లాస్ట్ డేట్. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!