Rajya Sabha: రాజ్యసభ రేసు..! ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు నేతలు ఎవరు..?
- ఏపీ నుంచి రాజ్యసభ రేసులో ఉన్నదెవరు?..
- పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరన్నదానిపై సస్పెన్స్..
- నాగబాబు కోసం ట్రై చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్..
- టీడీపీ ఈసారి ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఉత్కంఠ..
- ఏపీ బీజేపీ నుంచి కూడా తీవ్రంగా ఉన్న పోటీ..
- ఆ మధ్య సీఎంని కలిసిన కేంద్ర మాజీమంత్రి సురేశ్ ప్రభు..
Rajya Sabha: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు ఎన్డీఏ కూటమిలో పడటం లాంఛనమే. అయితే రాజ్యసభలో అడుగు పెట్టేది ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపే పనిలోపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. నాగబాబు.. జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు కల్యాణ్కు తోడుగా ఉంటున్నారు. అయితే, లింగమనేని రమేష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ నాగబాబు ఒకే అయితే.. సామాజిక సమీకరణాల్లో భాగంగా టీడీపీ నుంచి రేసులో ఉన్న సానా సతీష్, వంగవీటి రాధకు భంగపాటు తప్పదు. పీఏసీ, కార్పోరేషన్ చైర్మన్ కూడా కాపులకే ఇచ్చారు. ఈ కోణంలో అన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తే ఇబ్బంది అనుకుంటే.. లింగమనేని రమేష్కు ఇచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Pakistan: షియా-సున్నీల మధ్య ఘర్షణ.. 100 మంది మృతి
Also Read
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
- Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఇందులో మాజీ ఎంపీ బీద మస్తాన్రావును టీడీపీ తరపున మళ్లీ పెద్దలకు సభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్లకుపైగా పదవీకాలం ఉండగానే బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి టీడీపీ ఇచ్చిన హామీ మేరకు మస్తాన్రావును రాజ్యసభకు రెండో అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ నుంచి మరికొందరు ఆశావహులు లైన్లో ఉన్నారు. కిలారు రాజేష్, సానా సతీష్, టీడీ జనార్దన్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్, కనకమేడల, అశోక్ గజపతిరాజు వంటి నేతలు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా..? లేదంటే కొత్త అభ్యర్థిని రాజ్యసభకు పంపుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Read Also: Delhi: అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు.. మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ
మరోవైపు కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని సమాచారం. నెల రోజుల ముందే ఇద్దరూ భేటీ అయినట్టు సమాచారం. తనను ఏపీ తరపున నామినేట్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర సహకారం తప్పని పరిస్ధితుల్లో కచ్చితంగా బీజేపీ ఒక రాజ్యసభ సీటు దక్కుతుందని అంటున్నారు. అయితే ఏపీలో కమలం పార్టీ తరపున రాజ్యసభకు అభ్యర్ధులే లేరా అనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఏదేమైనా పెద్దలకు సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరన్నది కొద్ది రోజుల్లో తేలుతుంది. రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10 లాస్ట్ డేట్. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు.
తాజావార్తలు
-
Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్
-
Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
-
CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
-
Virat Kohli: “ఆ ఇన్నింగ్స్ వల్లే నాపై ఒత్తిడి తగ్గింది.. నాకంటే చాలా బాగా ఆడాడు”.. కోహ్లీ ప్రశంసల వర్షం!
-
Nayanthara: బాలయ్య ‘NBK 111’ నుంచి నయనతార అవుట్? రెమ్యునరేషన్ వల్లేనా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!