Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi By Elections For 3 Rajya Sabha Seats In Ap Who Are The Three Leaders Going To Rajya Sabha

Rajya Sabha: రాజ్యసభ రేసు..! ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు నేతలు ఎవరు..?

Published Date :November 28, 2024 , 10:17 pm
By Sudhakar Ravula
  • ఏపీ నుంచి రాజ్యసభ రేసులో ఉన్నదెవరు?..
  • పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరన్నదానిపై సస్పెన్స్..
  • నాగబాబు కోసం ట్రై చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్..
  • టీడీపీ ఈసారి ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఉత్కంఠ..
  • ఏపీ బీజేపీ నుంచి కూడా తీవ్రంగా ఉన్న పోటీ..
  • ఆ మధ్య సీఎంని కలిసిన కేంద్ర మాజీమంత్రి సురేశ్‌ ప్రభు..
Rajya Sabha: రాజ్యసభ రేసు..! ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు నేతలు ఎవరు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajya Sabha: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు ఎన్డీఏ కూటమిలో పడటం లాంఛనమే. అయితే రాజ్యసభలో అడుగు పెట్టేది ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపే పనిలోపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు సమాచారం. నాగబాబు.. జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు కల్యాణ్‌కు తోడుగా ఉంటున్నారు. అయితే, లింగమనేని రమేష్​ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ నాగబాబు ఒకే అయితే.. సామాజిక సమీకరణాల్లో భాగంగా టీడీపీ నుంచి రేసులో ఉన్న సానా సతీష్, వంగవీటి రాధకు భంగపాటు తప్పదు. పీఏసీ, కార్పోరేషన్ చైర్మన్ కూడా కాపులకే ఇచ్చారు. ఈ కోణంలో అన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తే ఇబ్బంది అనుకుంటే.. లింగమనేని రమేష్‌కు ఇచ్చే ఛాన్స్‌ ఉంది.

Read Also: Pakistan: షియా-సున్నీల మ‌ధ్య ఘర్షణ.. 100 మంది మృతి

మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఇందులో మాజీ ఎంపీ బీద మస్తాన్‌రావును టీడీపీ తరపున మళ్లీ పెద్దలకు సభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్లకుపైగా పదవీకాలం ఉండగానే బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి టీడీపీ ఇచ్చిన హామీ మేరకు మస్తాన్‌రావును రాజ్యసభకు రెండో అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ నుంచి మరికొందరు ఆశావహులు లైన్‌లో ఉన్నారు. కిలారు రాజేష్, సానా సతీష్, టీడీ జనార్దన్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్, కనకమేడల, అశోక్ గజపతిరాజు వంటి నేతలు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ఛాన్స్‌ ఇస్తారా..? లేదంటే కొత్త అభ్యర్థిని రాజ్యసభకు పంపుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Read Also: Delhi: అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు.. మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ

మరోవైపు కేంద్ర మాజీ మంత్రి సురేశ్‌ ప్రభు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని సమాచారం. నెల రోజుల ముందే ఇద్దరూ భేటీ అయినట్టు సమాచారం. తనను ఏపీ తరపున నామినేట్‌ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర సహకారం తప్పని పరిస్ధితుల్లో కచ్చితంగా బీజేపీ ఒక రాజ్యసభ సీటు దక్కుతుందని అంటున్నారు. అయితే ఏపీలో కమలం పార్టీ తరపున రాజ్యసభకు అభ్యర్ధులే లేరా అనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఏదేమైనా పెద్దలకు సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరన్నది కొద్ది రోజుల్లో తేలుతుంది. రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్‌ 10 లాస్ట్ డేట్. డిసెంబర్‌ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్‌ 20న పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 3 Rajya Sabha seats
  • Andhra Pradesh
  • Rajya Sabha
  • Rajya Sabha By Elections

తాజావార్తలు

  • Usman Tariq: వింత బౌలర్ ఉస్మాన్ తారిక్‌కు జాక్‌పాట్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయాడంటే..?

  • Jevon Searles: క్రికెట్‌లో మరో ఫిక్సింగ్ వివాదం.. KKR ఆటగాడిపై ఐసీసీ చర్య.!

  • Annadata Sukhibhava 2026: రైతులకు ఉగాది కానుక.. నేడే ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులు!

  • PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌‌కు మోడీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ

  • Abrar Ahmed: పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన ‘సన్‌రైజర్స్’ ఓనర్ కావ్యా.. SRH ఫ్యాన్స్ ఫైర్!

ట్రెండింగ్‌

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions