AP Inter Results 2025: బాలికలదే పై చేయి.. కృష్ణా జిల్లా ఫస్ట్.. అల్లూరి, చిత్తూరు జిల్లాలు లాస్ట్..
- ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..
- ఇంటర్ ఫస్టియర్లో 70 శాతం ఉత్తీర్ణత..
- ఇంటర్ సెకండియర్లో 83 శాతం ఉత్తీర్ణత..
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్ ఫస్టియర్లో 70 శాతం ఉత్తీర్ణత.. సెకండియర్లో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు.. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉంది అన్నారు మంత్రి నారా లోకేష్. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70 శాతం మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47 శాతంగా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు మరియు విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణంగా పేర్కొన్నారు..
Read Also: CSK Playoffs Chances: వరుసగా ఐదు ఓటములు.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఇలా!
Also Read
ఇంటర్ రెగ్యులర్ ఫస్టియర్ పరీక్షలకు 4,87,295 మంది విద్యార్థులు, ఇంటర్ రెగ్యులర్ సెకండియర్ పరీక్షలకు 4,22,030 మంది విద్యార్థులు హాజరు కాగా.. మొత్తం రెగ్యులర్ విద్యార్థుల సంఖ్య 9,09,325గా ఉంది.. ఒకేషనల్ విద్యార్థులు ఫస్టియర్లో 38,553 మంది, సెకండియర్లో 33,289 మంది కలిపి మొత్తం 71,842 మంది విద్యార్థులు హాజరయ్యారు.. ఇక, ప్రైవేట్గా పరీక్షలు రాసిన విద్యార్థులు 35,935 మంది.. మొత్తంగా ఇంటర్ ఫస్టియర్లో 5,25,848 మంది, సెకండియర్లో 4,91,254 మంది విద్యార్థులు కలుపుకొని 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు అయ్యారు.. అయితే, రెగ్యులర్ ఇంటర్ 3,51,521 మంది అంటే 83 శాతం మంది.. ఫస్టియర్లో 3,42,979 మంది అంటే 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. ఒకేషన్ ఫస్టియర్లో 77 శాతం, సెకండియర్లో 62 శాతం ఉత్తీర్ణులయ్యారు.. ఇక, రెగ్యులర్ ఇంటర్ సెకండియర్లో బాలుర ఉత్తీర్ణత శాతం 80 శాతంగా ఉంటే.. బాలికలు 86 శాతంతో పై చేయి సాధించారు.. ఇంటర్ ఫస్టియర్లోలో బాలురు 66 శాతం ఉత్తీర్ణులైతే.. బాలికలో 75 శాతంతో ముందు వరుసలో నిలిచారు.. ఒకేషన్ సెకండియర్లో బాలురు 67 శాతం, బాలికలు 84 శాతం.. ఫస్టియర్లో బాలురు 50 శాతం, బాలికలు 71 శాతం పాస్ అయ్యారు..
Read Also: Rajinikanth : ‘జైలర్ 2’ షూటింగ్ అప్డెట్..
మరోవైపు ఇంటర్ ఫలితాల్లో 93 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. గుంటూరు 91 శాతంలో రెండో స్థానంలో.. ఎన్టీఆర్ జిల్లా 89 శాతంతో మూడో స్థానంలో.. తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం 87 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 73 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామ రాజు జిల్లా.. అనకాపల్లి చివరి స్థానంలో నిలిచాయి.. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే.. వరుసగా 82 శాతం, 81 శాతం, 79 శాతంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం నిలిచాయి.. ఇక, 54 శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా అట్టడుగు స్థానానికి పరిమితమైంది..
Read Also: Nitish Kumar: తెరపైకి ఉప ప్రధాని పదవి.. నితీష్కి ఇవ్వాలని మిత్రపక్షం డిమాండ్
ఇక, వచ్చే నెల 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.. మరోవైపు.. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలి.. ఉత్తీర్ణత కాని వారు నిరాశ పడవద్దు.. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ పరీక్షలు రాయాలని సూచించారు.. ప్రభుత్వ కాలేజీలలో మంచి ఫలితాలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!