AP Ration Mafia: రంగంలోకి సీఐడీ.. రేషన్ మాఫియాపై విచారణ షురూ..
- బియ్యం దొంగల భరతం పట్టే స్పెషల్ ఆపరేషన్..
- ఏపీ రేషన్ మాఫియాపై సీఐడీ విచారణ షురూ..
- ఆరుగురు ఐపీఎస్లపై అభియోగాలు..
- పోర్టుల నుంచి స్మగ్లింగ్పై పూర్తి వివరాలు ఆరా తీస్తున్న సీఐడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Ration Mafia: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న బియ్యం అక్రమ రవాణా కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. కాకినాడ తీరంలో రేషన్ బియ్యంతో స్టెల్లా నౌక పట్టుబడటం, అక్రమ రవాణా వెనుక యంత్రాంగం అలసత్వం, మాఫీయాను మించిన నెట్వర్క్ ఏర్పడిపేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్న తీరుపై సీరియస్ అయ్యింది. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత సమగ్ర విచారణ కోసం CBCID కి అప్పగించాలని నిర్ణయించింది. రేషన్ బియ్యం యధేచ్చగా ఇతర దేశాలకు తరలిపోవడం వెనక మిల్లర్లు., బడ వ్యాపారులప్రమేయాన్ని నిర్ధారించడం ప్రధానంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు తమ దగ్గర వున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆరుగురు IPS ల సహకారంతో నేషనల్ హైవే మీద రేషన్ బియ్యం యధేచ్చగా తరలిపోయిన విషయం ఆధారాలతో సహా బహిర్గతం చేస్తామన్నారాయన.
Read Also: RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య సమీక్ష.. ఈసారి కూడా వడ్డీరేట్లు యథాతథం
Also Read
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
- Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
ఇప్పటికే కాకినాడు కలెక్టర్ ఆధ్వర్యంలో స్టెల్లా షిప్లో అణువణువూ తనిఖీ జరుగుతుండగా CID ఎంట్రీపై ఆసక్తీ నెలకొంది. ఒక్క సివిల్ సఫ్లైశాఖ 729 మందిపై కేసులు పెట్టింది. 102 వాహనాలను సీజ్ చేసింది. అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా… రౌడీ షీట్లు తెరుస్తామని సీరియస్ వార్నింగ్ ఇస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. బియ్యం దొంగల భరతం పట్టేందుకు ఏపీ సర్కార్ CID విచారణకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.. గతంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరి రేషన్ బియ్యం దారి మళ్లించారని.. ఆరుగురు ఐపీఎస్లు సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయని సర్కార్ చెబుతోంది. కాకినాడతో పాటు వివిధ పోర్టుల ద్వారా తరలిపోయిన బియ్యం లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధం చేసింది సీఐడీ.. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ పలుమార్లు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగి.. నేరుగా పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పరిశీలించడం.. అధికారుల వైఫల్యాలపై తీవ్రస్థాయిలో మండిపడడంతో.. ప్రభుత్వం ఈ ఇష్యూను సీరియస్గా తీసుకుంది.. సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ విషయంపై చర్చించడం.. కేబినెట్లో కూడా ఈ అంశం చర్చకు వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ తరలింపులపై సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!