RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య సమీక్ష.. ఈసారి కూడా వడ్డీరేట్లు యథాతథం
- నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య సమీక్ష..
- ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉండే ఛాన్స్..
- డిసెంబర్ 10తో ముగియనున్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం డిసెంబర్ 10వ తేదీతో అయిపోయింది. మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు కనిపిస్తుంది. దీంతో చివరి ఎంపీసీ సమావేశంలోనైనా వడ్డీ రేట్లను తగ్గించి ఊరట కల్పిస్తారా లేదా అన్న సందేహాలు స్టార్ట్ అయ్యాయి. అయితే, ప్రస్తుతం సీఆర్ఆర్ 4.5, రెపోరేటు 6.5 శాతంగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ భారీగా పడిపోవడానికి వీటిని తగ్గించకపోవడమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేడు ఏం చేస్తారో వేచి చూడాలి.
Read Also: AUS vs IND: నా కెరీర్లో ఎప్పుడూ చూడలేదు.. భారత్ సిద్ధంగా ఉండాలి: రవిశాస్త్రి
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
- Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రెండో త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఈరోజు (డిసెంబర్ 6) ప్రకటించనుంది. అయితే, ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే ఛాన్స్ ఉంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి రెపో రేటును గరిష్ఠ స్థాయిలోనే సెంట్రల్ బ్యాంక్ ఉంచుతుంది. ఈ క్రమంలో మరోసారి ఈ రేట్ల జోలికి వెళ్లకుండానే ద్రవ్య సమీక్షను ఆర్బీఐ ముగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు అటు బ్యాంకింగ్, ఇటు ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. రిటైల్, హోల్సేల్ ద్రవ్యోల్బణాలు బాగా పెరగడమే దీనికి ప్రధాన కారణం.
Read Also: Chhattisgarh: బీజేపీలో చేరినందుకు.. మాజీ సర్పంచ్లను కిడ్నాప్ చేసి చంపిన నక్సల్స్!
అయితే, అక్టోబర్లో ఏకంగా వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం 6.21 శాతానికి చేరిపోయింది. ఇక, మిశ్రమ ఆర్థిక పరిస్థితుల వల్ల నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని తగ్గించే ఛాన్స్ ఉందనే అంచనాలు ఉన్నాయి. ఒక వేళా ఇదే జరిగితే బ్యాంకులకు నిధుల లభ్యత పెరగనుంది. ఫలితంగా ఆయా రంగాలకు చౌకగా లోన్స్ లభిస్తాయి. వడ్డీరేట్లను తగ్గించకుండా ఈ రకంగా మార్కెట్కు ఊరట ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా చూస్తున్నట్లు సమాచారం.
Read Also: Deep Technology Summit-2024: నేడు డీప్ టెక్ సమ్మిట్-2024.. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
ఇక, ఆర్బీఐ గోల్డ్ నిల్వలను క్రమంగా పెంచుకుంటుంది. అక్టోబర్ నెలలో సెంట్రల్ బ్యాంకులు 60 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంట్లో రిజర్వు బ్యాంక్ అత్యధికంగా 27 టన్నుల గోల్డ్ను సేకరించినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 77 టన్నుల బంగారం కొనగా.. అందులో సెంట్రల్ బ్యాంక్ 27 టన్నులు కొనుగోలు చేసినట్లు ఐఎంఎఫ్ రిలీజ్ చేసిన నివేదిక ఆధారంగానే డబ్ల్యూజీసీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..