Daggubati Purandeswari: కుట్రలు జరుగుతున్నాయి.. భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలి..
- కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలి..
- మనకంటే ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేశారు.. స్వాతంత్య్రం తెచ్చారు..
- ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందన్న పురంధేశ్వరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలని పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.. ఈ కార్యక్రమంలో వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.. ఇక, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.. మనకంటే ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారు.. ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది అన్నారు.. ఆనాడు 40 కోట్ల మంది దేశ ప్రజలు ఈ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు.. ఇప్పుడు మన దేశ జనాభా 144 కోట్లు ఉన్నారు.. మన దేశ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు.
Read Also: Mahindra Thar Roxx SUV: మహీంద్రా థార్ రాక్స్ వచ్చేసింది.. ధర రూ.12.99 లక్షలు, మైమరిపించే ఫీచర్లు!
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
ఇక, ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు పురంధేశ్వరి.. కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలన్న ఆమె.. 2040 నాటికి వికసిత భారత్ చూడాలనేది లక్ష్యం.. వికసిత భారత్ కోసం మనం అంతా కలిసి పనిచేయాలి.. రాష్ట్ర అభివృద్ధికి అంకితం అయి ముందుకు సాగాలి అన్నారు.. మొన్న ఎన్నికలలో ప్రజలు కూటమికి తిరుగు లేని అధికారం ఇచ్చారు.. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం బీజేపీ వారధి కార్యక్రమం ప్రారంభించిందన్నారు.. నేటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు.. ప్రజలు సమస్యలు పరిష్కరించి వాటిని ఒక యాప్ లో కూడా పెడతాం అన్నారు.. ప్రజలకు సేవకులుగా పని చేసి.. వారి కన్నీరు తుడుస్తాం అన్నారు.. ఇక, ఈ సందర్భంగా వినతుల స్వీకరణకు ప్రత్యేక వెబ్ సైట్ను ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.
తాజావార్తలు
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!