Anna Canteens: నేడు అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం.. గుడివాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
- స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానున్న అన్న కాంటీన్లు..
- తొలి విడతలో 100 అన్న కాంటీన్లను ప్రారంభించనున్న కూటమి ప్రభుత్వం..
- ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన..
- సీఎం చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna Canteens: ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం కానున్నాయి.. రాష్ట్రంలో కేవలం 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపడం కోసం కూటమి సర్కార్ మళ్లీ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు అన్న కాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 180 రెడీ అయ్యాయి.. ఇక, తొలి విడతలో 100 అన్న కాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. అలాగే, మిగిలిన 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు.
Read Also: Stones In Kidney: కిడ్నీలో రాళ్లతో ఇబ్బందులా..? ఇలా చేయండి ఉపశమనం పొందండి..
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
కాగా, సెప్టెంబర్ 5వ తేదీన మరో 99 క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేసేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇకపోతే, అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్మెంట్ అనే సంస్థ దక్కించుకుంది. కాగా, అన్న క్యాంటిన్ల యొక్క మెనూ అండ్ టైమింగ్స్ ను మనం పరిశీలిస్తే.. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు అన్న క్యాంటీన్లు కొనసాగుతాయి. రూ. 5 కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందించనున్నారు. టిఫిన్ ఉదయం 7.30 నుంచి 10 గంటల మధ్య అందుబాటులో ఉండగా.. మధ్యాహ్నం లంచ్ 12.30 నుంచి 3 గంటల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి భోజనం 7.30 నుంచి 9 గంటల మధ్య అందించనున్నారు.
Read Also: Independence Day: 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
ఇవాళ కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తారు.. ఎన్టీఆర్ తొలిసారి ప్రాతినిథ్యం వహించిన గుడివాడలోనే అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం కాబోతోంది.. పేదలతో కలిసి గుడివాడ అన్న క్యాంటీన్లో భోజనం చేయనున్న చంద్రబాబు. గుడివాడలో పేదలతో ఇంటరాక్ట్ కానున్నారు.. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నారు.. అయితే, ఎన్నికల కోడ్ ఉన్నందున్న విశాఖలో ప్రారంభానికి నోచుకోవడం లేదు అన్న క్యాంటీన్లు. తొలి విడతలో మొత్తంగా 17 జిల్లాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది కూటమి ప్రభుత్వం..
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి