Independence Day: 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
- నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం
- ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Independence Day: దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది ప్రధాని మోడీ చారిత్రాత్మక మూడో టర్మ్లో మొదటి ప్రసంగం కావడం విశేషం.ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఇది వరుసగా 11వ సంవత్సరం. ముఖ్యాంశాలను రూపొందించే ప్రభుత్వ విధానం, పలు అభివృద్ధి ప్రకటనలపై ఏం చెప్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం యొక్క థీమ్ “విక్షిత్ భారత్@ 2047”.. ఇది 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సూచిస్తుంది. 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది.
Read Also: Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్యను వదలని దొగలు.. రూ.50లక్షలు విలువ చేసే వీధి లైట్ల చోరీ
Also Read
- YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
- SS Rajamouli: "ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది".. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ “హర్ ఘర్ తిరంగా” ప్రచారానికి పెరుగుతున్న ప్రజాదరణను ప్రశంసించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రారంభమైన ఈ ప్రచారం నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. “140 కోట్ల మంది భారతీయులకు త్రివర్ణ పతాకంపై ఉన్న గాఢమైన గౌరవాన్ని తెలియజేస్తూ హర్ఘర్తిరంగా భారతదేశం అంతటా ప్రాచుర్యం పొందింది” అని ప్రధాని మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతకుముందు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులు “హర్ ఘర్ తిరంగ అభియాన్” లో పాల్గొన్నారు. తిరంగా యాత్ర కూడా జరిగింది.ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు 6,000 మంది ప్రత్యేక అతిథులు ఆహ్వానించబడ్డారు, వీరిలో గిరిజన సంఘాల సభ్యులు, రైతులు, మహిళలు, ఆశా కార్యకర్తలు, నర్సు మంత్రసానులు, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.
ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని కూడా వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలతో సహా 10,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించడంతో భారీ భద్రతా బందోబస్తులో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఏఐ- ఆధారిత కెమెరాలు, అధునాతన సీసీటీవీ అనలిటిక్స్, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, అతిథుల కోసం ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్తో పాటు నిఘా వ్యవస్థలు కూడా అప్గ్రేడ్ చేయబడ్డాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా జమ్మూ కాశ్మీర్లో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమయ్యాయి. శ్రీనగర్ వీధులను త్రివర్ణ దీపాలంకరణతో అలంకరించారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై 750 మీటర్ల పొడవైన జెండాతో తిరంగా ర్యాలీ చేపట్టారు.
తాజావార్తలు
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
ట్రెండింగ్
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!