Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగూరు నారాయణ.. అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొండవీటి వాగు, పాలవాగు పనులను వేగవంతం చేశామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అమరావతిలో ప్రస్తుతం 69 వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.. గతంలో కొండవీటి వాగు వెడల్పు చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం దానిని 65 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దీంతో వరద నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఉండదని, భవిష్యత్తులో నీరు నిలిచిపోయే సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నీటి పారుదల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. మరో ఏడాది లోపల రాజధాని ప్రాంతంలో వర్షపు నీటి సమస్యలు లేకుండా సమగ్ర ప్రణాళికతో పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ గుర్తుచేశారు. అయితే కేంద్ర కార్యాలయాల నిర్మాణ వ్యయంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాల ఖర్చు ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి చదరపు అడుగుకు సుమారు రూ.3,900 అంచనా వ్యయం ఉందని, తమ భవనాల ఖర్చుతో పోలిస్తే దాదాపు రూ.600 ఎక్కువేనని తెలిపారు. అయినప్పటికీ వాస్తవాలను వక్రీకరించి ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అనేక భవనాలు సాధారణ నిర్మాణాలు కాదని, భవిష్యత్తులో అమరావతి గుర్తింపుగా నిలిచే ఐకానిక్ నిర్మాణాలని నారాయణ పేర్కొన్నారు. అందువల్ల వాటి నిర్మాణ వ్యయం సహజంగానే ఎక్కువగా ఉంటుందని వివరించారు.
దేశ పార్లమెంట్ భవనం, తెలంగాణ సచివాలయం వంటి ప్రతిష్ఠాత్మక భవనాల నిర్మాణంలో కూడా ప్రారంభ అంచనాలతో పోలిస్తే చివరికి ఖర్చులు గణనీయంగా పెరిగాయని మంత్రి గుర్తుచేశారు. అయితే ఆ విషయాలను ప్రస్తావించకుండా కేవలం అమరావతి నిర్మాణాలపై మాత్రమే విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు. రాజధాని అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, వరద నివారణ చర్యలు అన్నీ సమాంతరంగా కొనసాగుతున్నాయని, అమరావతిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!