Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే. ఇక ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఫ్యూచర్లోనూ అమరావతే రాజధానిగా కొనసాగుతుంది. ఈ మేరకు చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లుకు ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్ చేసినప్పటికీ.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందు కేంద్ర కేబినెట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న రాజధాని సందిగ్ధతకు ముగింపు పలికేలా, అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
Read Also: Naga Shaurya : శ్రీదేవి నా లక్కీ చార్మ్ కావాలి అని కోరుకుంటుంన్నా..
Also Read
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించడం ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా ఖరారు చేస్తూ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ద్వారా APCRDA పరిధిలోని ప్రాంతమంతా అమరావతిగా గుర్తించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ మార్చి 28న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. 2014 విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఉంటుందని చెప్పారు. అమరావతి అనే పేరును స్పష్టంగా పొందుపరచలేదు. గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన 3 రాజధానుల గందరగోళం భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే, విభజన చట్టంలోనే అమరావతి పేరు ఉండాలని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సెక్షన్ 5(2) కు సవరణ కోరుతూ తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర హోం శాఖకు పంపిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీని ద్వారా ఏపీ రాజధానిగా అమరావతి హోదాపై ఉన్న న్యాయపరమైన, సాంకేతిక పరమైన చిక్కులు తొలగిపోయి, కేంద్రం నుంచి అందే నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు మార్గం సుగమం కానుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత… పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ గడువు 2024 జూన్ 2తో ముగుస్తుంది. అదే రోజు నుంచి అమరావతి రాజధానిగా ఉంటుందని బిల్లులో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీకి ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!