Amaravati Capital Works: అమరావతి రాజధాని పనులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- అమరావతి రాజధాని పనులపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- ఏప్రిల్ 15వ తేదీ తర్వాత అమరావతి రాజధాని పనుల ప్రారంభం..
- సచివాలయం వెనక ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం..
- రాజధాని పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ..
- ఏర్పాట్లపై సీఆర్డీఏ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital Works: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులపై కీలక నిర్ణయం తీసుకుంది.. వచ్చే నెల అంటే ఏప్రిల్ 15వ తేదీ తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది.. ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనక ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం.. ఇక, అమరావతి రాజధాని పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, సచివాలయం వెనక వైపు ప్రాంతంలో రాజధాని పనులు ప్రారంభించాలని.. అదే ప్రాంతంలో సభ కూడా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడాల్సిందిగా సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: Nag Ashwin: నాని – విజయ్ దేవరకొండ వివాదాలపై నాగ్ అశ్విన్ రియాక్షన్..
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
కాగా, కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే పలు రకాల పనులకు సీఆర్డీఏ అనుమతి ఇవ్వడం.. దానికి కేబినెట్ సమావేశ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి.. అయితే, ఇవాళ సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు.. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు.. అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన.. రాజధాని పనుల పునఃప్రారంభానికి సంబంధించిన స్థలం ఎంపిక, ముహూర్తం, ఇతర ఏర్పాట్లపై అధికారులతో సీఎం ప్రిలిమినరీ సమావేశం నిర్వహించారు.. ఇక, ప్రధాని మోడీ టూర్కు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. అమరావతి రాజధాని రీ లాంచ్ కు ప్రధాని మోడీ రాబోతున్నారు.. వచ్చే నెల రెండో వారంలో అమరావతిలో పర్యటించనున్నారు మోడీ.. మొత్తంగా ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనక ప్రాంతంలో రాజధాని పనుల రీ లాంచ్.. అదే ప్రాంతంలో ప్రధాని బహిరంగ సభ నిర్వహించేలా వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
-
Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
-
BSNL JTO Recruitment 2026: జాబ్ కావాలా?.. బీఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు రెడీ.. అర్హతలు, పూర్తి వివరాలు
-
Rajat Patidar: టీమిండియాలోకి ఎంట్రీ? నాకైతే అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
-
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..