Andhra Pradesh: నేటి నుంచి అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడిన మహానుభావుల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఉంటారు. 1897 జూలై 4న విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు జన్మించారు. అయితే చిన్నతనంలోనే ఆధ్యాత్మికతకు ఆకర్షితుడు అయ్యి ఆయన చదువు మానేసి సన్యాసిగా మారి పశ్చిమగోదావరి జిల్లా అడవుల్లో నివసించేవారు. అడవుల్లో జీవనం సాగించే సమయంలోనే బ్రిటీష్ వారి అటవీ చట్టాల ద్వారా గిరిజనులపై జరుగుతున్న దాడులను అల్లూరి తన కళ్లారా చూశారు. దీంతో గిరిజనుల కష్టాలను తొలగించాలని ఏకంగా బ్రిటీష్ వారిపైనే సమరానికి సిద్ధమయ్యారు. అందుకే అల్లూరికి మన్యం వీరుడు అని పేరొచ్చింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన వీర రంపా తిరుగుబాటుకు ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటీష్ వలస పాలనలో ఆదివాసీ ప్రజలు వారి స్వంత భూముల నుండి పరాధీనులుగా మారుతున్న పరిస్థితులు.. భారత అటవీ సంపదను దోచుకోవడానికి, బ్రిటీష్ వారు వివిధ ప్రజా వ్యతిరేక చట్టాల ద్వారా స్థానిక యజమానుల స్వంత భూమిని లాక్కోవడానికి తీసుకొచ్చిన చట్టాలను అల్లూరి సీతారామరాజు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి మద్దతుగా అల్లూరి సీతారామరాజు ప్రతిజ్ఞ చేసినప్పటికీ ఆయన బ్రిటీష్ పాలకులపై పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. అల్లూరి నేతృత్వంలోని గిరిజన సైనికులు గెరిల్లా వ్యూహాల ద్వారా అడవుల్లోని వివిధ ప్రదేశాల్లో బ్రిటిష్ అధికారులపై హింసాత్మక దాడులు చేశారు. చివరకు 27 ఏళ్ల వయసులోనే అల్లూరిని చింతపల్లె అడవుల్లో చెట్టుకు కట్టేసి బ్రిటీష్ పాలకులు కాల్చి చంపారు.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
కాగా స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం నేటి నుంచి వారంరోజుల పాటు ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తోంది. భీమవరంలో తొలిరోజు విద్యార్థులు దేశనాయకుల వేషధారణల్లో భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. జూలై 4న ప్రధాని మోదీ స్థానిక ఏఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!