ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే 2021-22 కు సంబందించిన జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామనే సమగ్రసమాచారాన్ని పొందుపరచింది. ఈ జాబ్ నోటిఫికేషన్ను రిలీజ్ చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలకు సంబందించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది.
Read: ‘అఖండ’ ప్రత్యేక గీతంలో రత్తాలు!
పోటీ పరీక్షల్లో పారదర్శకత ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పోటీ పరీక్షలు అభ్యర్ది నైపుణ్యంపైనే జరగాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఏపీపీఎస్సీ పరీక్షల ఎంపిక విషయంలో ఇంటర్వ్యూలను రద్దుకు సంబందించిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి జారీ చేశారు.