Chittoor: ఏడాది కష్టం.. క్షణకాలంలో నేలమట్టం.. గ్రామ ప్రజలను హడలెత్తిస్తున్న ఏనుగులు..
Chittoor: ఓ మహిళా ప్రకృతి వ్యవసాయం చేసింది. ఏడాది పాటు రాత్రి పగలు నిద్రాహారాలు మాని పెట్టిన పైరును కంటికి రెప్పలా కాపాడుకుంది. అయితే ఆమె కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయింది. ఆరుగాలం కష్టపడి పెట్టుకున్న పంటను ఏనుగుల గుంపు నాశనం చేసింది. ఈ ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా లోని బైరెడ్డిపల్లి మండలం లోని కడతట్లపల్లె గ్రామం లోని పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ క్రమంలో కోతల దశలో ఉన్న మూడు ఎకరాల అరటి తోట నేలమట్టం అయ్యింది. ఈ తోటను ఆ గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే మహిళా రైతు సంవత్సరం పాటు ప్రకృతి వయవసాయ పద్దతులను ఉపయోగించి సాగు చేసింది.
Read also:War 2: ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన యష్ రాజ్ ఫిల్మ్స్…
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
కాగా ఆ తోట బాగా పండి కోతకు వచ్చింది. ఇక కాయలు దింపాలి అనుకుంటున్న సమయంలో ఏనుగుల గుంపు తోట పైన దాడి చేసి అరటి చెట్లను నాశనం చేసాయి. ఈ ఘటనతో ఆ మహిళకు రూ/ 3 లక్షలు నష్టం వచ్చింది. కష్టపడి పెట్టిన పైరు తీరా చేతికి వచ్చే సమయానికి ఇలా జరగడంతో వరలక్ష్మి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతు కుటుంబం కోరుకుంటుంది. కాగా ఏనుగుల గుంపు సంచారంతో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామ ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో