Chittoor: ఏడాది కష్టం.. క్షణకాలంలో నేలమట్టం.. గ్రామ ప్రజలను హడలెత్తిస్తున్న ఏనుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor: ఓ మహిళా ప్రకృతి వ్యవసాయం చేసింది. ఏడాది పాటు రాత్రి పగలు నిద్రాహారాలు మాని పెట్టిన పైరును కంటికి రెప్పలా కాపాడుకుంది. అయితే ఆమె కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయింది. ఆరుగాలం కష్టపడి పెట్టుకున్న పంటను ఏనుగుల గుంపు నాశనం చేసింది. ఈ ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా లోని బైరెడ్డిపల్లి మండలం లోని కడతట్లపల్లె గ్రామం లోని పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ క్రమంలో కోతల దశలో ఉన్న మూడు ఎకరాల అరటి తోట నేలమట్టం అయ్యింది. ఈ తోటను ఆ గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే మహిళా రైతు సంవత్సరం పాటు ప్రకృతి వయవసాయ పద్దతులను ఉపయోగించి సాగు చేసింది.
Read also:War 2: ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన యష్ రాజ్ ఫిల్మ్స్…
Also Read
కాగా ఆ తోట బాగా పండి కోతకు వచ్చింది. ఇక కాయలు దింపాలి అనుకుంటున్న సమయంలో ఏనుగుల గుంపు తోట పైన దాడి చేసి అరటి చెట్లను నాశనం చేసాయి. ఈ ఘటనతో ఆ మహిళకు రూ/ 3 లక్షలు నష్టం వచ్చింది. కష్టపడి పెట్టిన పైరు తీరా చేతికి వచ్చే సమయానికి ఇలా జరగడంతో వరలక్ష్మి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతు కుటుంబం కోరుకుంటుంది. కాగా ఏనుగుల గుంపు సంచారంతో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామ ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!