Funds Misuse: 2019 ఎన్నికల నిధుల్లో గోల్ మాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల నిధుల్లో గోల్ మాల్ జరిగిందా? అడ్డగోలుగా ఖర్చు చేసి బిల్లులు సమర్పించడంలో నిబంధనలకు నీళ్లొదిలారా? ఆడిట్ లో అక్రమాలు బయటపడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో అక్రమాలు, నిబంధనలు అతిక్రమించడం ఆడిట్ లో వెలుగు చూస్తున్నాయి. అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుంచి ముగ్గురు సీనియర్ ఆడిటర్లు కర్నూలు కలెక్టరేట్ ఎన్నికల విభాగంలో రెండు రోజులుగా ఆడిటింగ్ కొనసాగిస్తున్నారు. ఎన్నికల నిధుల్లో ఖర్చు చేసిన మొత్తానికి సమర్పించిన బిల్లులు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణకు ఖర్చు చేసిన మొత్తంలో 5 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయని, అదనపు నిధులు మంజూరు చేయాలని 2020 లో కలెక్టరేట్ ఏవో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాయడంతో 2021లో అదనపు నిధులు మంజూరు చేశారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కోటి 25 లక్షలకు సంబంధించి బిల్లులపై , నోట్ ఫైల్ పై అప్పటి కలెక్టర్, డి ఆర్ ఓ సంతకాలు చేయాల్సి ఉండగా ఆ తరువాత వచ్చిన అధికారులు సంతకాలు చేసినట్లు ఆడిట్ లో తేలింది. జిల్లా కేంద్రంలో చేసిన ఖర్చులకు 3 కోట్ల 28 లక్షలు, 14 నియోజకవర్గాల్లో కోటి 5 లక్షలు మంజూరు చేశారు. 2 కోట్లకు సంబంధించిన బిల్లులపై అప్పటి కలెక్టర్ , డిఆర్ ఓ, ఎన్నికల సూపరెంటెండెంట్ సంతకాలు లేవు. ఈ నిధుల్లో కొంత మేరకు ఇతర ఖాతాలోకి మళ్లించడం, సరైన పత్రాలు సమర్పించకపోవడం ఆడిట్ లో బయటపడింది.
Also Read
- BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
- Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
- Kanaka Durga Temple: నేడు హైదరాబాద్ నుంచి కనకదుర్గమ్మకు బంగారు బోనం.. వీఐపీ దర్శనాలు నిలిపివేత!
- OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
ఎన్నికల సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ, మరో ఇంజినీరింగ్ కాలేజీ వద్ద రెండు అదనపు జనరేటర్లు, కలెక్టర్ బంగ్లాలో ఒకటి అద్దెకు 3 లక్షల 63 వేలు ఖర్చు అయినట్టు బిల్లులు పెట్టారు. అద్దె మొత్తంతో కొత్త జనరేటర్లు కొనుగోలు చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫర్నిచర్ కొనుగోలు చేయకపోయినా కొనుగోలు చేసినట్లు బిల్లులు పెట్టారని విమర్శలు ఉన్నాయి. మిస్ లేనియస్ ఖర్చులు 11 లక్షల 42 వేలు చేశారట. పోలింగ్ తరువాత రాయలసీమ యూనివర్సిటీ , మరో ఇంజినీరింగ్ కాలేజి లో 40 రోజులు ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడ వీఐపీ తరహాలో అభ్యర్థులకు వసతి ఏర్పాటు చేసినట్లు 62 లక్షల 33 వేలు బిల్లులు పెట్టారు. వాస్తవంగా ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించలేదు. మొత్తమ్మీద ఎన్నికల నిధులపై ఆడిటింగ్ అక్రమాలను బట్టబయలు చేసింది.
Read Also: Ap Highcourt: సంక్షేమ వసతి గృహాల దుస్థితిపై హైకోర్ట్ ఆగ్రహం
తాజావార్తలు
-
BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
-
Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్లో మిడిల్క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?
-
Explainer: రాత్రికి రాత్రే దాడి.. కంట్రోల్ తప్పిన ఏఐ..దెబ్బకు కథ అడ్డం తిరిగింది!
-
Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
-
Ferty9: అంతర్జాతీయ పరిశోధనల్లో విశేష గుర్తింపు.. ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ‘ఫెర్టీ9’!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!