ఒకప్పుడు పెళ్లంటే చాలా సింపుల్గా జరిగిపోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. డబ్బు పెరిగింది. ఆలోచన మారింది. ఒకరి కంటే గొప్పగా వేడుక చేసుకోవాలని తాపత్రయం పడుతున్నారు. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకునేది. దీన్ని గ్రాండ్గా చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దీని పేరుతో కొత్త కొత్త ట్రెండ్లు సృష్టిస్తున్నారు. పెళ్లికి ముందు ఫొటోషూట్లంటూ.. విహారయాత్రలంటూ లేనిపోని ఆచరాలు పుట్టుకొస్తున్నాయి. ఈ పేరు మీద కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ఆ మధ్య ఫొటోషూట్ పేరుతో నదిలోకి దిగి వీడియోలు తీస్తుండగా ప్రమాదవశాత్తు పుట్టి మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఫొటోషూట్ పేరుతో జరిగిన ఘటనలో తృటిలో వధువుకు ముప్పు తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Yellamma : చివరి నిమిషంలో సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా..!
భారత సంతతి చెందిన జంట కెనడాలో ఉంటున్నారు. అయితే వివాహ వేడుక కోసం భారత్కు వచ్చారు. అయితే పెళ్లి-రిసెప్షన్కు ముందు జంట ఫొటోషూట్ ఏర్పాటు చేశారు. నవ వధూవరులిద్దరూ ఆనందంగా.. సంతోషంగా ఫొటోలు.. వీడియోలు దిగుతున్నారు. ఉన్నట్టుండి ఏమి ఆలోచన వచ్చిందో.. ఏమో తెలియదు గానీ.. కొంచెం భిన్నంగా ఉండాలని అనుకున్నారేమో తెలియదు గానీ.. కలర్ బాంబులను ఏర్పాటు చేశారు. ఫొటోషూట్ కోసం వరుడు.. వధువును పైకి లేపాడు. ఆ సమయంలో ఒక్కసారిగా కలర్ బాంబ్ పేలి వధువును వేగంగా ఢీకొట్టింది. అంతే ఒక్కసారిగా ఆమె విలవిలలాడిపోయింది. ఆమె జుట్టు కాలిపోవడమే కాకుండా.. నడుం దగ్గర తీవ్రగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను జంట ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Mohammed Siraj: ఆర్సీబీ, కోహ్లీని వీడటంపై మహ్మద్ సిరాజ్ ఏమన్నాడంటే?
పెళ్లిళ్లలో బాణాసంచా పేల్చడం సహజమే. అయితే ఏది చేసినా శృతిమించకూడదు. లేదంటే లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. జంట వీడియో పోస్ట్ చేసి.. తమలా ఎవరూ చేయొద్దని.. ఒకవేళ ఫొటోషూట్లు చేసుకున్నా జాగ్రత్తలు తీసుకోవాలని జంట విక్కీ, ప్రియా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను 22 మిలియన్లు వీక్షించారు. ఆమె వెంటనే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని యథావిధిగా పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇక వీడియోను వీక్షించిన నెటిజన్లు.. వధువు పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని వివాహ బంధాన్ని ఆస్వాదించాలని కోరారు.