Google and Twitter: గూగుల్, ట్విట్టర్ తాజా నిర్ణయాలు
Google and Twitter: గ్లోబల్ టెక్ కంపెనీలు ఇతర దేశాలతోపాటు ఇండియాలో కూడా ఖర్చులను తగ్గించుకోవటంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. ఇన్నాళ్లూ ఉద్యోగులను రాత్రికిరాత్రే తీసివేయగా ఇప్పుడు ఆఫీసులను సైతం తెల్లారే సరికి మూసివేస్తున్నాయి. తాజాగా గూగుల్ మరియు ట్విట్టర్ సంస్థలు ఈ మేరకు చర్యలు చేపట్టాయి. గూగుల్ కంపెనీ 453 మందికి లేఆఫ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 12 వందల మంది ఉద్యోగులను తీసేయటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
read more: Air India order support US jobs: బోయింగ్కి ఎయిరిండియా ఆర్డర్ వల్ల అమెరికాలో ఎన్నో జాబులు: బైడెన్
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితుల వల్లే ఇలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్లో పేర్కొన్నట్లు ప్రముఖ ఇంగ్లిష్ మీడియా సంస్థ తెలిపింది. ఇదిలాఉండగా.. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్.. ఇండియాలోని మూడు ఆఫీసుల్లో రెండింటిని మూసేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.
ఇప్పుడిక బెంగళూరులోని ట్విట్టర్ ఆఫీస్ మాత్రమే రన్నింగ్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ అధిపతి అయ్యాక ఈ సోషల్ మీడియా సంస్థ గతేడాది చివరలో ఇండియాలోని మొత్తం సిబ్బందిలో 90 శాతం మందిని తొలగించిన సంగతి తెలిసింది. ఈ నిర్ణయం అనంతరం ఈ కంపెనీ పే-రోల్లో కేవలం 12 మంది మాత్రమే మిగిలారు. ఖర్చులను భారీగా కుదించుకోవటం ద్వారా బ్యాలెన్స్ షీట్ను మెయిన్టెయిన్ చేయాలని భావించి ఆఫీసులను క్లోజ్ చేయటానికి కూడా ట్విట్టర్ వెనకాడలేదు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో