దేశ రాజధానిలో తెలుగు డాక్టర్ ఔదార్యం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“కరోనా” పేషెంట్ల ప్రాణాలను ఎలా కాపాడాలో అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయత. కళ్లముందే ప్రాణాలు పోతుంటే, చలించిపోయున ఓ తెలుగు డాక్టర్ ఓ వారంగా తీవ్రంగా పలు ప్రయత్నాలు చేశారు. స్థలం దొరికితే, “కోవిడ్” సెంటర్ పెట్టి, “కరోనా” పేషెంట్లకు ఉచిత వైద్య సేవలు అందించాలని తాపత్రయపడ్డారు. ఆక్సిజన్ తో సహా, ఉచితంగా మందులు కూడా అందించాలనే సత్సంకల్పంతో, ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి లో పనిచేస్తున్న రోబో సర్జన్ డాక్టర్. కల్పన రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలుగు పండుగలు, సమావేశాలు, తెలుగు వారంతా ఒక చోట సమావేశమై సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించుకొనేందుకు, తెలుగు ప్రజల సంక్షేమం కోసం 70 వ దశకంలో కేంద్ర ప్రభుత్వం “ఖాన్ మార్కెట్” కు సమీపంలో కేటాయించిన స్థలంలో 4 అంతస్తుల “ఆంధ్ర అసోసియేషన్” ప్రధాన కార్యాలయం నిర్మాణం జరిగింది. అన్ని వసతులు ఉన్న ఈ నాలుగు అంతస్థుల భవనంలో “కోవిడ్ సెంటర్” ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని నిర్వహణ కమిటీ ని డా. కల్పన రెడ్డి అభ్యర్దించారు. అయితే , నిర్వహణ కమిటీ ససేమిరా అన్నారు. “కోవిడ్” తో బాధ పడుతున్న చాలామంది తెలుగువారు ఫోన్లు చేసి వైద్యసహాయం చేయాలని మొరపెట్టుకుంటున్నారని, వారికి మాత్రమే వైద్య సేవలు ఉచితంగా అందిస్తానని, ఒక డాక్టర్ గా ఇతర మెడికల్ స్టాఫ్ ను, నిపుణులను, ఇతరత్రా కావాలసిన మానవ వనరులను కూడా సమకూర్చుకుంటానని “ఆంధ్ర అసోసియేషన్” నిర్వహణ కమిటీ ని ఆమె అభ్యర్ధించారు. కానీ, నిర్వహణ కమిటీ మాత్రం డాక్టర్ కల్పన రెడ్డి అభ్యర్ధనను అంగీకరించలేదు.
Also Read
అయితే , డాక్టర్. కల్పన రెడ్డి మాత్రం తన ప్రయత్నాలను విరమించలేదు. అనేక స్కూళ్ల యాజమాన్యాలను సంప్రదించారు. చివరకు, లజపత్ నగర్ లోని అమర్ కాలనీ లో ఉన్న “సరస్వతి బాల మందిర్” యాజమాన్యం ఒప్పుకుంది….వెంటనే, యుధ్దప్రాతిపదికన స్కూల్ ప్రాంగణంలో 30 బెడ్లతో “కోవిడ్ సెంటర్” ను ఏర్పాటు చేశారు. “ఆంధ్ర అసోసియేషన్” భవనంలో “కోవిడ్” సెంటర్ పెడితే, మన తెలుగు వారికే 100 శాతం వైద్య సేవలు అందించవచ్చని అనుకున్నాను. కానీ, వారు ఒప్పుకోలేదు. అయునా, “సరస్వతి బాల మందిర్” లో 30 బెడ్లతో ఏర్పాటు చేసిన “కోవిడ్” సెంటర్ లో మొత్తంగా తెలుగువారికే సహాయం చేయలేకపోవచ్చు. కానీ, “కోవిడ్” తో బాధ పడే మన తెలుగు వారికి కూడా ఇక్కడ వైద్య సేవలు అందిస్తామని”, డాక్టర్. కల్పన రెడ్డి అన్నారు.
డా.కల్పన రెడ్డి, సహచరులు డాక్టర్. ప్రసన్న తో పాటు, మరి కొద్ది మంది స్నేహితులు, స్కూలు యాజమాన్యం కూడా కలిసి అవసరమైన ఆర్ధిక వనరులు సమకూర్చుకున్నారు. 5 లీటర్ల సామర్ధ్యం కల 30 “ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్” ను 30 బెడ్ల వద్ద ఏర్పాటు చేశారు. అదనంగా మరో 20 బెడ్ల వరకు పెంచుకునేందుకు అవకాశం ఉందని”, డాక్టర్ కల్పన రెడ్డి తెలిపారు. రానున్న మరో పది రోజుల్లో మరో 20 బెడ్లను, అదనంగా డాక్టర్లను కూడా సిధ్దం చేసుకుంటామని డాక్టర్ కల్పన రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి, మొత్తం 8 మంది డాక్టర్లు, మరో 8 మంది మెడికల్ స్టాఫ్ తో “కోవిడ్ సెంటర్” లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు సిధ్దంగా ఉన్నామని డా. కల్పన రెడ్డి అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!